16 April, 2026 | 10:12 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

టీజీఎన్పీడీసీఎల్ రివ్యూ సమావేశం

04-12-2025 06:49 PM

కొత్తపల్లి (విజయక్రాంతి): గురువారం రోజున కరీంనగర్ సర్కిల్ సమావేశ మందిరంలో సర్కిల్ రివ్యూ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో కరీంనగర్ సూపర్ ఇంటెండింగ్ ఇంజనీర్ మేక రమేష్ బాబు వివరిస్తూ రాబోయే వేసవి కార్యచరణ ప్రణాళిక సిద్ధంగా ఉండాలని ఏఈలకు, ఏడీలకు ఆదేశించడం జరిగింది. ఎక్కడైతే పవర్ ట్రాన్స్ఫార్మర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఓవర్ లోడ్ అయ్యే అవకాశం ఉంటే అక్కడ అదనపు, సామర్థ్యం పెంపుదల ట్రాన్స్ఫార్మర్ పెట్టాలని ఆదేశించారు. 33కేవీ, 11కేవీ లైన్లు ఓవర్ లోడ్ అయ్యే అవకాశం ఉన్నచోట కొత్త లైన్లు ఏర్పాటు చేయమని ఆదేశించాడు.

వినియోదారులకు అంతరాయాలు లేకుండా 11కేవీ, 33కేవీ మెయింటెనెన్స్ చేయాలని, వ్యవసాయ సర్వీస్ అప్లికేషన్ను 15 రోజుల్లోపు సర్వీస్ కనెక్షన్ ఇవ్వాలని, గృహ, వాణిజ్య మీటర్లు ఏడు రోజుల్లోపు రిలీజ్ కావాలని ఆదేశించడం జరిగింది. 1912 ఫోన్ ద్వారా వినియోగదారుల నుండి వచ్చిన ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే విద్యుత్ ప్రమాదాలు జరగకుండా పొలం బాట, పల్లెబాట, బస్తీబాట, పట్టణ బాట నిర్వహించి వినియోదారులకు అవగాహన సదస్సు నిర్వహించి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా వినియోగదారులకు అవగాహన చేయాలని ఆదేశించడం జరిగింది. ఈ సమావేశంలో డిఈలు కే ఉపేందర్, రాజం, లక్ష్మారెడ్డి,ఎం తిరుపతి, ఎస్ఎఓ రాజేంద్రప్రసాద్, ఏవోలు, ఏఏఓలు, ఏడిఈలు, ఏఈలు, పాల్గొన్నారు.