16 April, 2026 | 10:13 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

సర్పంచ్ అభ్యర్థిగా బొక్కలపల్లి దశరథ్ రెడ్డి నామినేషన్

04-12-2025 06:47 PM

అడ్డాకుల: మండల గ్రామ పంచాయతీ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొక్కలపల్లి దశరథ రెడ్డి భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీగా ఏర్పాటు చేసిన ప్రదర్శన ఎన్నికలు గ్రామ వాతావరణాన్ని మరింత సందడిగా మార్చాయి. ఈ సందర్బంగా దశరథ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి మహిళల కోసం పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్నాయన్నారు.

దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అండదండలతో పోటీ చేస్తున్నాని తెలిపారు. గ్రామ ప్రజల ఆశీర్వాదంతో భారీ మెజార్టీతో గెలుస్తానని నమ్మకంగా ఉన్నాను అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అభ్యర్థిని అభినందించారు. అనంతరం ర్యాలీ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకుని నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో విజయ మోహన్ రెడ్డి, శేఖర్ రెడ్డి,  శ్రీనివాస్ రెడ్డి, వేగ నాథ్, హనుమంతు, అంజన్న, తదురులు పాల్గొన్నారు.