1 July, 2026 | 8:57 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

వేదాంత నుంచి 4వ మధ్యంతర డివిడెండ్

26-09-2024 12:02 AM

8న బోర్డు సమావేశం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: మైనింగ్ దిగ్గజం వేదాంత లిమిటెడ్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి  ఇన్వెస్టర్లకు మరో బొనాంజా ప్రకటించేందుకు సిద్ధమయ్యింది. ఈ ఆర్థిక సంవత్సరానికి నాల్గవ మధ్యంతర డివిడెండు ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకుని, ఆమోదించేందుకు తమ బోర్డు అక్టోబర్ 8న సమావేశమవుతుందని వేదాంత బుధవారం స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది.

సంబంధిత డివిడెండు చెల్లింపునకు అక్టోబర్ 16 రికార్డు తేదీగా నిర్ణయించినట్లు వెల్లడించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఇప్పటివరకూ వేదాంత మొత్తం రూ. 13,474 కోట్లను డివిడెండుగా ఇన్వెస్టర్లకు పంపిణీ చేసింది. మూడో ఇంటెరిం డివిడెండుగా షేరుకు రూ.20 చొప్పున పంచేందుకు సెప్టెంబర్ 2న బోర్డు ఆమోదం తెలిపింది.

ఈ డివిడెండు రికార్డుతేదీ సెప్టెంబర్ 10. అంతక్రితం జూలైలో షేరుకు రూ.4 చొప్పున జూలైలో, షేరుకు రూ.11 చొప్పున మే నెలలో డివిడెండ్లను చెల్లించింది. వేదాంత లిమిటెడ్‌లో ప్రధాన వాటా కలిగిన మాతృసంస్థ వేదాంత రిసోర్సెస్ చేతికే డివిడెండులో అధిక శాతం వెళుతుంది.