ఆ ఇంటర్యూ మాయని మచ్చ
న్యూఢిల్లీ: కాఫీ విత్ కరణ్ షో ఇంటర్యూ తన కెరీర్లో మాయని మచ్చగా మిగిలిపోయిందని టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ అభిప్రాయపడ్డాడు. శనివారం నిఖిత్ కామత్తో జరిగిన పాడ్కాస్ట్ ఇంటర్యూలో పాల్గొన్న రాహుల్ తన అనుభవాలను పంచుకున్నాడు.‘సాధారణంగా ట్రోలింగ్ను పెద్దగా పట్టించుకోను. కానీ కొన్నేళ్ల క్రితం నాపై విపరీతమైన విమర్శలు వచ్చాయి. కాఫీ విత్ కరణ్ షో ఇంటర్వ్యూ వ్యక్తిగతంగా చాలా భయపెట్టింది.
ఆ వివాదం తర్వాత నా జీవితం మారిపోయింది. టీమిండియాకు ఆడడం మొదలుపెట్టాకా నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. 100 మందిలో ఉన్నా దైర్యంగా మాట్లాడేవాడిని. కానీ ఇప్పుడు అలా చేయలేకపోతున్నా. షోలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో జట్టు నుంచి సస్పెన్షన్కు గురయ్యా. తొలిసారి ఒక చేదు అనుభవం ఎదురైంది. నా జీవితంలో ఆ ఇంటర్యూ మాయని మచ్చగా మిగిలిపోయింది’ అని రాహుల్ చెప్పుకొచ్చాడు.




