10 May, 2026 | 5:47 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

పేదలకు మెరుగైన విద్యనందించడమే ధ్యేయం

22-06-2024 03:53 AM
  • స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

జనగామ, జూన్ 21(విజయక్రాంతి): పేద విద్యార్థులకు మెరుగైన విద్యనందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. జనగామ కలెక్టరేట్‌లో శుక్రవారం కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌తో కలిసి అమ్మ ఆదర్శ పాఠశాలల అభివృద్ధి పనులపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యాశాఖ పాఠశాలల్లో మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. మిగిలిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఉపా ధ్యాయులు సమయపాలన పాటించాలన్నారు.

విద్యార్థుల హాజరుశాతాన్ని పెంచేలా కృషి చేయాలన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని ఏడు మండలాల నుంచి ఏడు బడులను ఎంపిక చేసి ఆ బడులకు ఉత్తమ పురస్కారాలు అందజేస్తామ న్నారు. ప్రథమ పురస్కారం రూ.25 లక్షలు, ద్వితీయ పురస్కారం రూ.15 లక్షలు, తృతీ య పురస్కారం రూ.10 లక్షలు అందజేస్తామన్నారు. సమావేశంలో డీఈవో రాము, వివిధ మండలాల ప్రత్యేక అధికారులు, నోడ ల్ అధికారులు, ఇంజినిరింగ్ అధికారులు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.