calender_icon.png 1 May, 2025 | 7:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూ సమస్యల పరిష్కారానికే భూభారతి చట్టం

01-05-2025 12:00:00 AM

భూమి హక్కుల రికార్డుల్లో తప్పుల సవరణకు అవకాశం

దౌల్తాబాద్, ఏప్రిల్ 30: రైతులకు ఎదురయ్యే భూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకే ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకు వచ్చిందని, కార్యాలయానికి రైతులు వస్తే అధికారులు ఓపికతో సమాధానం చెప్పాలని రాష్ర్ట ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, కలెక్టర్ మను చౌదరి అన్నారు. బుధవారం దౌల్తాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదికలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు.

రాయపోల్ మండలం ఆరేపల్లి రైతు వేదికలో భూభారతి చట్టంలోని వివిధ అంశాలను జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ రైతులకు, ప్రజలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు భూభారతి చట్టం లో చక్కటి పరిష్కారం జరుగుతుందని, చట్టం పైన గ్రామాల్లో రైతులకు పూర్తి అవగాహన కల్పించాలని తెలిపారు.

కొన్న భూమిని రిజిస్ట్రేషన్ చేసుకొని వారికి ఇప్పుడు కబ్జాలో ఉన్న భూములు వారి పేరు మీదకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆస్కారం ఈ చట్టంలో ఉందన్నారు. భూభారతి చట్టం చేసేటప్పుడు కమిషన్ సలహాలు సూచనలు అడిగితే ప్రభుత్వం ఇచ్చిన భూములలో ఎస్సీ, ఎస్టీ ప్రజలు చాలామంది కబ్జాలో ఉన్నారు కానీ వారి పేరు మీద పట్టాలేక రైతు భరోసా పడక  నష్టపోతున్నారని వారికి పట్టాలు అందించాలని విజ్ఞప్తి చేశామన్నారు.

ఎస్సీ, ఎస్టీ అసైన్డ్ భూమిపై హక్కులు కలిగిన మోకా మీద లేకుండా కొంతమంది అమ్ముకున్న 1977 యాక్ట్ ప్రకారం అసైన్డ్ భూములు అమ్మడానికి వీల్లేదని రెగ్యులరైజేషన్ చేసే ఆప్షన్ ఉందని అనరులో చేతికి వెళ్తే వారి నుండి ప్రభుత్వం భూమి తీసుకొని అరులైన వారికి అందిస్తుందన్నారు. ప్రభుత్వ భూములు, ఎండోమెంట్, ఇతరత్రా భూములు ఎవరైనా కబ్జా చేసి ఉంటే వారికి నోటీస్ ఇచ్చి వెరిఫై చేసి నిజ నిర్ధారణ జరిపి నిర్ణీత కాలవ్యవధిలో ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.

8 వేల సర్వే, పదివేల గ్రామస్థాయిలో పోస్టులు భర్తీ చేసి అందరికీ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసి ప్రజలకు పారదర్శకంగా జిల్లాస్థాయిలో అన్ని సమస్యలను పరిష్కారం జరగాలని ఈ చట్టం ప్రవేశపెట్టారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు సదానందం, చంద్రకళ, పిఎసిఎస్ చైర్మన్ వెంకటరెడ్డి, మండల స్పెషల్ ఆఫీసర్ లింగమూర్తి, తహసిల్దార్ లు చంద్రశేఖర రావు, శ్రీనివాస్, ఎంపీడీవో వెంకట లక్ష్మమ్మ, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.