calender_icon.png 14 June, 2025 | 4:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూసమస్యల శాశ్వత పరిష్కారమే భూభారతి చట్టం

14-06-2025 12:16:59 AM

కామారెడ్డి, జూన్ 13,(విజయ క్రాంతి) : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న భూభారతి చట్టం శాశ్వతంగా భూ సమస్యలకు పరి ష్కారం చూపనిందని  దోమకొండ తహసిల్దార్ జి .సుధాకర్ అన్నారు. శుక్ర వారం కామారెడ్డి జిల్లా దోమకొండ మం డల కేంద్రంలోని రైతు వేదికలో   రెవెన్యూ సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ, ప్రతి భూ సమస్యకు స్థిరమైన పరిష్కారం అందించేందుకు రెవెన్యూ సదస్సులు గొప్ప వేదిక అవుతున్నాయన్నారు.

రైతులు వీటిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవా లన్నారు. వచ్చిన దరఖాస్తులపై ఫీల్ పరిశీలన పూర్తయ్యాక వాటిని ఆన్లైన్లో నమో దు చేయాలని సిబ్బందికి  ఆదేశించారు. రైతులతో ముఖాముఖి మాట్లాడిన తహసిల్దార్ సుధాకర్, వారి సమస్యలను తెలుసుకొని, భూభారతి చట్టంలోని అంశాలను వివరించారు.

సదస్సులో రెవెన్యూ అధికారులు ప్రింటెడ్ దరఖాస్తు ప్రొఫార్మాలను అందజేశారు. హెల్ప్ డెస్క్ల వద్ద సదుపాయాలు, సిబ్బంది పనితీరును తహసిల్దార్  పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జి.సుధాకర్, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్, మండల అధ్యక్షుడు అనంతరెడ్డి,డిప్యూటీ తహసీల్దార్ రేఖ నాయక్, పంచాయతీ కార్యదర్శి యాదగిరి, అధికారులు, సిబ్బంది, నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.