14-06-2025 12:15:17 AM
ఎంపికైన జ్యోతిష్మతి విద్యార్థుల పరిశోధనా పత్రం
కరీంనగర్, జూన్ 13 (విజయ క్రాంతి): జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల ఈసీఈ నాలుగవ సంవత్సరం విద్యార్థులు శరణ్య గజ్జల, శ్రీలేఖ కుచన, నమ్రత బెల్లం, శ్రీజ చింతకింది, వ్రాసిన ‘పైథాన్ ప్రోగ్రామింగ్ ఫర్ ఎఫిషియంట్ బ్రీథోమిక్స్ ఇమేజ్ ప్రాసెసింగ్ అండ్ అనాలిసిస్‘ అనే పరిశోధన వ్యాసానికి కెనడాలోని అల్బెర్టాలో ఆగస్టు 18-22, 2025న జ రుగనున్న ఐట్రిపుల్ఈ స్మార్ట్ వరల్ కాంగ్రెస్ 2025లో ప్రదర్శన కోసం దాని కార్యకలాపాలలో ప్రచురణ కోసం రెగ్యులర్ పేపర్గా ఆమోదించబడిందని కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్ రావు తెలిపారు.
ఆగస్టులో కెనడాలోని అల్బెర్టాలో విద్యార్థులు తమ పరిశోధనా పత్రాన్ని ప్రదర్శించనున్నారని పేర్కొన్నారు. విద్యార్థులు శరణ్య గజ్జల, శ్రీలేఖ కుచన, నమ్రత బెల్లం, శ్రీజ చింతకింది ప్రిన్సిపల్ డాక్టర్ అనిల్ కుమార్, డి రవి కిరణ్ బాబు పర్యవేక్షణ లో ఈ పరిశోధనా వ్రాశారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను చైర్మన్ తో పాటు సెక్రెటరీ, కరస్పాండెంట్ జువ్వాడి సుమిత్ సాయి, డీన్ అకాడమిక్ డాక్టర్ పీకే వైశాలి, విభాగాధిపతులు అభినందించారు.