14-06-2025 12:17:44 AM
హోరాహోరిగా అభ్యర్థుల ప్రచారం
మందమర్రి,(విజయక్రాంతి): పట్టణంలోని మార్కెట్ పద్మశాలి సంఘం అధ్యక్ష ఎన్నికల ప్రచారం హోరా హోరిగా సాగింది గత వారం రోజులుగా అభ్యర్థుల ప్రచారంతో పద్మశాలి కుల బాంధవుల ఇండ్లు అభ్యర్థుల తాకిడితో కళకళలాడాయి. ఈనెల 15న నిర్వహించనున్న ఎన్నికలకు శుక్రవారం సాయంత్రంతో ప్రచారం ముగిసింది. ప్రచారం చివరి రోజు పోటీలో ఉన్న అభ్యర్థులు పోటా పోటీగా ప్రచారం నిర్వహించారు. అధ్యక్ష బరిలో నిలిచిన బత్తుల శ్రీనివాస్ తన అనుచరులతో మార్కెట్ నుండి పట్టణంలోని పలు కాలనీల మీదుగా పద్మశాలి కుల బాంధవులను కలుస్తూ బైక్ ర్యాలీ చేపట్టగా, మరో అభ్యర్థి బత్తుల సతీష్ బాబు తనను గెలిపించాలని కోరుతూ మార్కెట్ లో పాదయాత్ర చేపట్టి కుల బంధువుల ఓట్లను అభ్యర్థించారు. మరో అభ్యర్థి అడిచర్ల నాగేందర్ వ్యక్తిగతంగా కుల బంధువులను కలుస్తూ తనని గెలిపించాలని ప్రచారం కోరుతున్నారు. అధ్యక్ష బరిలో త్రిముఖ పోటీ ఉన్నప్పటికీ, ప్రధాన పోటీ మాత్రం బత్తుల సతీష్, బత్తుల శ్రీనివాస్ మధ్యనే ఉందని కుల బంధువులు చర్చించు కుంటున్నారు. ప్రచారం ముగియడంతో అభ్యర్థుల భవితవ్యం ఈ నెల 15 న తేలనుంది.