12 May, 2026 | 11:19 PM

Breaking News

భధ్రాచలంలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు   •   హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •  

ధిక్కార స్వరాన్ని వినిపించిన ధైర్యశీలి భగత్ సింగ్

24-03-2025 01:32 AM

సూర్యాపేట, మార్చి 23: నాడు భారతదేశంలో బ్రిటిష్ పాలన విధానాన్ని సహించ లేక, ప్రజలు అనుభవిస్తున్న దీనస్థితికి చలించిపోయి సాక్ష్యాత్తు పార్లమెంటులోనే బాంబులు వేసి ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ తన ధిక్కార స్వరాన్ని వినిపించిన ధైర్యశీలి భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ నేటి యువత ఉద్యమ స్పూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళాలని పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షులు పుల్లూరి సింహాద్రి పిలుపునిచ్చారు.

ఆదివారం భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల 94 వ వర్ధంతి సందర్భంగా వారి చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పివైఎల్ నాయకులు, వీరబోయిన లింగయ్య, రామకృష్ణ పి.డి.ఎస్.యు నాయకురాలు సంధ్య, మహేశ్వరి, నవ్య, పావని, మానస, మనీషా, శైలజ, అఖిల, లావణ్య పాల్గొన్నారు.