17 July, 2026 | 8:55 PM

Breaking News

సిరిసిల్ల అభివృద్ధికి కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిందేమీ లేదు: సీపీఎం నేత ఎం.డి. అబ్బాస్   •   విద్యార్థినుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   తరగతి గది దాటిన చిన్నారుల బాధ్యత   •   భార్య కాపురానికి రానని నిరాకరించడంతో భర్త బలవన్మరణం   •   మంథనికి ‘న్యాక్’ అంతర్జాతీయ స్కిల్ సెంటర్: మంత్రి శ్రీధర్ బాబు   •   నాళేశ్వర్ గ్రామంలో ఘనంగా మహాలక్ష్మి బోనాల పండుగ   •   పటేల్‌కుంట చెరువుకు సుందరీకరణ పనులు త్వరలో చేపడతాం: ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి   •   బీఆర్ఎస్ వి చౌకబారు రాజకీయాలు: యాదగిరి సునీల్ రావు   •   మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పిలుపు   •   పట్టు చేనేత డైరెక్టర్‌కు సన్మానం   •  

ధిక్కార స్వరాన్ని వినిపించిన ధైర్యశీలి భగత్ సింగ్

24-03-2025 01:32 AM

సూర్యాపేట, మార్చి 23: నాడు భారతదేశంలో బ్రిటిష్ పాలన విధానాన్ని సహించ లేక, ప్రజలు అనుభవిస్తున్న దీనస్థితికి చలించిపోయి సాక్ష్యాత్తు పార్లమెంటులోనే బాంబులు వేసి ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ తన ధిక్కార స్వరాన్ని వినిపించిన ధైర్యశీలి భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ నేటి యువత ఉద్యమ స్పూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళాలని పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షులు పుల్లూరి సింహాద్రి పిలుపునిచ్చారు.

ఆదివారం భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల 94 వ వర్ధంతి సందర్భంగా వారి చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పివైఎల్ నాయకులు, వీరబోయిన లింగయ్య, రామకృష్ణ పి.డి.ఎస్.యు నాయకురాలు సంధ్య, మహేశ్వరి, నవ్య, పావని, మానస, మనీషా, శైలజ, అఖిల, లావణ్య పాల్గొన్నారు.