15 April, 2026 | 12:56 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేసిన బీఆర్‌ఎస్

05-02-2026 12:20 AM
  1. గాడిలో పెడుతూ హామీలను నెరవేరుస్తున్నాం
  2. పెద్దపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి
  3. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

పెద్దపల్లి, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): పెద్దపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బుధవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మీడియా సమావేశంలో మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేసినా తాము గాడిలో పెట్టి, ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకెళ్తున్నామని చెప్పారు.

పదేళ్ల పరిపాలనలో పట్టణాలను, పల్లెలను గాలికొదిలేసారని, ఏం మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారని, ఎన్నికలు వస్తె అడ్డగోలుగా మాటలు చెప్పే పార్టీ బీఆర్‌ఎస్ అని, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి పెద్దపల్లి జిల్లాకు నిధులు కేటాయించలేదని అన్నారు. జిల్లాలో మున్సిపల్‌లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తామన్నారు. జిల్లా కేంద్రంలో ఐటీ పార్కును మంజూరు చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే విజయరమణరావు పాల్గొన్నారు.