calender_icon.png 20 June, 2025 | 8:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక ఎన్నికల సందడి షురూ..

20-06-2025 12:00:00 AM

  1. ఏ నలుగురు గుమిగూడిన ఎన్నికలపైనే చర్చ
  2. పోటీకి  సిద్ధమవుతున్న యువత
  3. జిల్లాలో 311గ్రామపంచాయతీలు
  4. అనుచరులతో మంతనాలు..ఎలాగైనా గెలువాలని వ్యూహాలు 
  5. ఆశావహులుకు గుదిబండగా రిజర్వేషన్లు..? 

మందమర్రి, జూన్ 19: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభు త్వం సుముఖంగా ఉండడంతో ఈ నెలాఖరు వరకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట్ర  మంత్రులు ప్రకటిస్తున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో  స్థానిక సంస్థల ఎన్నికల సందడి నెల కొంది. జిల్లావ్యాప్తంగా 18 మండలాల్లోని 311 గ్రామ పంచాయతీలలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి నెలకొంది.

ఆయా గ్రామాల్లోనీ ముఖ్య కూడళ్లలో  ఏ నలుగురు గుమి గూడిన స్థానిక సంస్థల ఎన్నికల అంశం చర్చకు వస్తుండడంతో ఎన్నికల వాతావరణం వేడెక్కుతుంది. రాష్ట్ర ప్రభు త్వం ఈ నెల ఆఖరి వరకు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని స్పష్టం చేయడంతో ఆశావాహులు తమ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. ఇప్పటి నుండి గ్రామా ల్లో తమ అనుచరులతో మంతనాలు సాగి స్తూ ఎలాగైనా గెలువాలని వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

జిల్లా వ్యాప్తంగా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు తమ రిజర్వేషన్లు అనుకూలిస్తే మరోసారి బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవు తుం -డగా వీరికి తోడు యువ తరం పోటీకి ఆసక్తి చూపుతుండడంతో ఆయా గ్రామాల్లో బహుల పోటీ నెలకొనే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి.

స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ పదవికి పార్టీల ప్రమేయం లేకుండా జరుగనుండగా ఆయా గ్రామాల్లో పట్టున్న వారు, రాజకీయ పార్టీల మద్దతుతో బరిలో నిలిచే అవకాశా లు అధికంగా కనిపిస్తున్నాయి. దీనికి తోడు కుల సంఘాల మద్దతు కూడ గట్టి ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో పక్కా ప్రణాళికలు రూపొందిస్తూ విజయమే లక్ష్యం గా పోటీలో దిగేందుకు పావులు కదుపు తున్నట్లు స్పష్టమవుతుంది.

గ్రామాల్లో జోరందుకున్న చర్చలు..

రాష్ట్ర ప్రభుత్వం ఈనెల చివరి వరకు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం మొదటి దశలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు తదుపరి దశలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది ఈ మేరకు ఈ నెల చివరి వరకు నోటిఫికేషన్ జారీ చేస్తామని రాష్ట్ర మంత్రులు ప్రకటించడం పట్ల గ్రామాల్లోని ఆశావహులు తమ మద్దతుదారులతో జోరుగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

జిల్లావ్యాప్తంగా 311 గ్రామపంచాయతీలలో మాజీ ప్రజా ప్రతినిధుల పాటు ఔత్సా హికులు, యువత పోటీకి సిద్ధమవుతుండడంతో పోటీ తీవ్రంగా నెలకొనే అవకాశాలు న్నాయి. నోటిఫికేషన్ రాకముందే చర్చలు మంతనాలు జోరు కావడంతో ఎన్నిక నోటిఫికేషన్ నాటికి ఎన్నికల వాతావరణం జోరు  అందుకునే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.

రిజర్వేషన్లు కలిసొచ్చేనా?..

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి బీసీ కులగణన జనాభా ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపిన విషయం తెలిసిందే.  స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తా మని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం, ఇదేవిధంగా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు బిసి ల కు 42 శాతం సీట్లు కేటాయించే అవకాశాలు అధికంగా ఉండటంతో ఆశావహులుకు రిజర్వేషన్లు గుదిబండగా మారే ప్రమాదం ఉందని పలువురు భావిస్తున్నారు.

రిజర్వేషన్ల అంశంపై స్పష్టత వస్తే ఆశావాహుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది పార్టీలకతీతంగా జరగనున్న సర్పంచ్ ఎన్నికల్లో పోటీ తీవ్రత ఎక్కువ అధికంగా ఉండే అవకాశాలు ఉండగా ఎంపీటీసీ జడ్పిటిసిలో అభ్యర్థి తలను దక్కించుకునేందుకు రిజర్వేషన్ అనుకూలించిన అభ్యర్థులు పార్టీ అధిష్టానంపై అగ్ర నాయకులపై ఒత్తిడి తీసుకువచ్చే పనులు ఇప్పటినుండే తల మునుకలు అయినట్టు సమాచారం ఏదేమైనాప్పటికీ జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం కొట్టొచ్చినట్లు కనిపిస్తుండ డంతో ఎన్నికల నోటిఫికేషన్ నాటికి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల సందడి నెలకొననుంది.

ఏదేమైనప్పటికీ స్థానిక సంస్థల పాలకవర్గ ముగిసి సంవత్సరం కాలం అనంతరం ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడంతో జిల్లా వ్యాప్తంగా ఎన్నికల వాతావరణం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు.