17 April, 2026 | 10:34 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్ గా ముత్తవరపు వెంకట రమణ

19-06-2025 10:46 PM

కోదాడ: కోదాడ మండలం కాపుగల్లు గ్రామానికి చెందిన ముత్తవరపు వెంకటరమణ తెలంగాణలోని మొయినాబాద్ ఆజాద్ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం నేషనల్ ఫార్మసీ టీచర్స్ అసోసియేషన్(National Pharmacy Teachers Association) వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు. ఆల్ ఇండియా కౌన్సిల్ టెక్నికల్ ఎడ్యుకేషన్ న్యూఢిల్లీ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారు నిన్న జరిగిన నామినేటెడ్ సభ్యులలో ఒకరిగా ముత్తవరపు వెంకటరమణను ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా నామినేట్ చేయడం జరిగింది.

గతంలో కూడా వీరు ఫార్మసీ కౌన్సిల్ సభ్యుడిగా పని చేయడం జరిగింది. వీరు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులుగా ఎంపికైనందుకు నలగొండ మాజీ డిసిసిబి చైర్మన్ ముత్తవరపు పాండు రంగారావు, కాపుగల్లు మాజీ సర్పంచ్ తొండపు సతీష్, సొసైటీ చైర్మన్ నంబూరు సూర్యం, రిటైర్డ్ హెడ్ మాస్టర్ ముత్తవరపు రామారావు, ఫైనాన్స్ హనుమంతరావు తదితరులు ఆయన్ని అభినందించారు.