17 March, 2026 | 1:57 AM

దేశాభివృద్ధికి జనగణన అత్యంత కీలకం

17-03-2026 01:12 AM

కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్, మార్చి ౧౬ (విజయక్రాంతి): దేశాభివృద్ధికి జనగణన అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ అభిలాష అన్నారు. భారత జనాభా గణన - 2027 కి సంబంధించి, కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సోమవారం అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, దేశాభివృద్ధిలో జనగణన ప్రక్రియ కీలక భూమిక పోషిస్తుందని అన్నారు. జనగణన ప్రక్రియకు సం బంధించి, గృహాల గుర్తింపు, జనగణన వివరాల నమోదులో తప్పులకు తావు ఉండ కూడదని పేర్కొన్నారు. మాస్టర్ ట్రైనర్లు అం దించే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోవాలని వివరించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఆర్డీవో రత్నకళ్యాణి, సీపీఓ జీవరత్నం, డిపివో శ్రీనివాస్, జెడ్పీ సీఈవో శంకర్,ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.