26-05-2025 12:00:00 AM
రచన అంటే ప్రజల పక్షాన చేసే యుద్ధమే. అంటే రచయితలు, కవులు, కళాకారులు, బుద్ధిజీవు లు, సామాజిక చింతన కలవారంతా యుద్ధవీరులే కదా! సాహిత్యకారులకు అలుపు అన్నది ఉండకూడదు. సమాజ శ్రేయస్సుకోసం సాహిత్య పోరాటం నిరంతరం సాగవలసిందే. అప్పుడే, మహానుభావులు కోరుకున్న సమసమాజం ఆవిష్కారమవుతుంది.
ఈ లక్ష్యంతోనే చరిత్రలో అనాదిగా తెగలు, జాతులు, భాషల అస్తిత్వం కోసం, అణచివేత నుంచి కొన్ని వర్గాల విముక్తి కోసం ఇప్పటికీ పాలకులపైన ఆ పీడిత వర్గాలు పోరాడుతూనే ఉన్నాయి. పెట్టుబడిదారీ వర్గానికి వంత పాడినట్టుగానే అనేక ప్రభుత్వాలు కూడా అణచివేతకు గురయ్యే వర్గాలకు కాకుండా సంపన్న వర్గాలకు లేదా పీడించే వర్గాల కు మాత్రమే వంత పాడడాన్ని మనం గమనించవచ్చు.
ప్రపంచంలో అనేక దేశాలలో మాదిరిగానే భారతదేశంలోనూ అసమ సమాజం స్పష్టంగా మన కళ్ళ ముందు తన వైకల్యాన్ని ప్రదర్శిస్తున్నది. అసమానతలు, అంతరాలు దీర్ఘకాలం కొనసాగడానికి న్యాయబద్ధమైన కొన్ని పోరాటాలను పరిశీలించకుండా వ్యతిరేక నిర్ణయాలను ప్రభుత్వాలు తీసుకొంటుంటాయి. అణచివేత ల కారణంగా కూడా ప్రజా పోరాటాలకు చోటు దక్కకపోగా పీడించేవాళ్లే పాలకులుగా చలామణి కావచ్చు అవుతుండడం బాధాకరం.
బాధ్యతను గుర్తెరగాలి
ఈ పరిస్థితులలో వ్యవస్థలో పాలకులు ప్రజలను వంచించడం, మోసగించడం, బానిసలుగా చూడడం, ఉద్యోగ రంగాలలో బానిసత్వం, రాజ్యాంగ బద్ధమైన హక్కులను హరించడం, ప్రజా ధనాన్ని కొల్లగొట్టడం, కొద్దిమంది చేతిలో ప్రజా సంపద బందీ కావడం, ప్రభుత్వమే అసమానతలు అంతరాలను పెంచి పోషించడం వంటివాటితోపాటు క్లబ్బులు,
పబ్బులు, ఈవెంట్లు, ధూమపానం మద్యపానం, మత్తు పదార్థాలు, అనారోగ్యక కారక వస్తువులను అనుమతించి యువతను, ప్రజానీకాన్ని నిర్వీర్యం చేయడం వంటి పరిస్థితులు అనేకం సమాజంలో కనిపిస్తుంటాయి. ఇలాంటి అన్నింటిపైన కవులు, కళాకారులు, మేధావులు, బుద్ధిజీవులు తమ కలాలతో సమరభేరి మ్రోగించాలి.
సామాజికంగా కొన్ని వైరుధ్యాలు, అంధ విశ్వాసాలు, తప్పుడు భావనలతో ప్రజలను కొల్లగొడుతూ, అరాచక అకృత్యాలతోపాటు ముఖ్యంగా మహిళలు, కార్మికులపైన జరుగుతున్న దాడులు చాలా బాధాకరం. ఉద్యోగ వ్యవస్థలో కూడా సమాన పనికి సమాన వేతనం కాకుం డా కొంతమందితో వెట్టి చాకిరీ చేయించుకోవడానికి ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగుల నియామకాలు జరుగుతుండడం మనం చూడవచ్చు.
పని మిగ తా ఉద్యోగుల మాదిరిగానే ఉన్నప్పటికీ వేతనం మాత్రం నామమాత్రంగా ఉండడాన్ని గమనిస్తే ఈ అంతరాలు ఏ ప్రయోజనం కోసమో పాలకులు తెలుసుకోవాలి. అందుకే, ఈ అకృత్యాల గురించి పాలకులకు తెలియజేయవలసిన బాధ్యత రచయితలపై ఎంతో ఉంటుంది. పాలకులపైన ఒత్తిడి చేయడానికి నిజమైన యుద్ధం చేయవలసింది కవులు, కళాకారులు, మేధావులు.
వారు రాసే రచనల్లో సామాజిక అంశాలతోపాటు రాజకీయ పరమైనటువంటి విషయాలను సవాలుగా తీసుకొని ప్రభుత్వాలపైన కలాలను ఎక్కు పెట్టాల్సిన అవసరం ఉంది. సంభాషణలు, కవితలు, కథలు, నాటకాలు, చిత్రలేఖనం, వ్యాసాలు అనేక రకాల ప్రక్రియల ద్వారా వెల్లడించే వీలుంటుంది.
తమ రచనలను ఇలా ప్రజల దృష్టికి తీసుకువెళ్లడంతోపాటు పాలకులు సిగ్గుపడేలా గుర్తించేలా చేయవలసిన అవసరమూ ఎంతో ఉంది. ప్రజా జీవితమంతా రాజకీయంతో ముడి పడితే రాజకీయమే సాహిత్యనికి మూలమైన నేపథ్యంలో అరాచక రాజకీయంపైన సాహిత్యకారులకు అమితమైన బాధ్యత ఉంటుందనేది అందరం అంగీకరించి తీరాలి.
నైతిక విలువల పునరుద్ధరణ కోసం..
సాహిత్య లోకం నిజంగా ప్రతిపక్ష పాత్ర పోషించ వలసిన అవసరం ఉంది. నిజమైన యుద్ధవీరులుగా, శాంతిని కోరే శాంతి కాముకులుగా, యుద్ధాన్ని రెచ్చగొట్టే పాలక ఇతర పెట్టుబడిదారీ వర్గాల దమన నీతిని ఎండగట్టే విధంగా రచనలు కొనసాగించాలి. మొక్కుబ డి వర్ణనలు, అంధ విశ్వాసాలను పెంచే రచనలు, లక్ష్యం లేని సాహిత్యం, సామాజిక ప్రయోజనం లేని రచనలను సమాజం అంగీకరించ కూడదు.
అలాంటి రచయితలను బహిష్కరించ వలసిన అవసరం కూడా ఉంది. అప్పుడు మాత్రమే నిజమైన సాహిత్యాన్ని ప్రజలు ఆమోదిస్తారు. ఈ రకంగా ప్రజల పక్షాన పని చేయడానికి కవులు, రచయితలకు అవకాశం లభిస్తుంది. తోటి మనిషిని సాటి మనిషిగా చూడలేని అమానవీయ సంఘటనలకు సమాజం ఆలవాలమైనప్పుడు,
అలాం టి పరిస్థితుల నుంచి తప్పించడానికి, నైతిక విలువలను పునరుద్ధరించడానికి, సమానత్వాన్ని సాధించడానికి, వివక్ష, పేదరికం, నిరుద్యోగం, ఆకలి చావులు, ఆత్మహత్యల వంటి వాటిని ప్రధానంగా రచనలకు ఇతివృత్తాలు గా తీసుకొని అక్షరాలను ఎక్కుపెట్టాలి. ప్రధానంగా అక్ష ర యుద్ధం పాలకులు, అసాంఘిక శక్తులపైనే అని మరవరాదు.
సమసమాజ స్థాపనకు అడ్డుకట్టలు వేసే పెట్టుబడిదారీ వ్యవస్థ గాని, రాజ్యహింసను కానీ రచనల పరంగా ఖచ్చితంగా ప్రతిఘటించవలసిన అవసరం ఉంది. ఎం దుకంటే, పాలకులకు ప్రజల ప్రయోజనాల కన్నా స్వప్రయోజనాలే మిన్నగా కనిపించడం క్షంతవ్యం కాదు. ప్రజల రక్షణ కోసం, సమస్య పరిష్కారం కోసం రచయితలు నడుం కట్టాల్సిందే. పూర్తిగా ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యలనే సాహిత్య వస్తువులుగా స్వీకరించాలి.
సామాజిక చింతనతో వివిధ కళారూపాలను కథలుగా, వ్యాసాలుగా, ఇంకా వివిధ ప్రక్రియలలో ఎక్కుపెట్టి సంధించాలి. ఇలాంటి నిజమైన అక్షర యుద్ధవీరులుగా సాహిత్యకారులు నిలబడవలసిన అవసరం ఉంది. ప్రతి రచయిత, కవి, కళాకారుడు అందరూ తమ స్వప్రయోజనాల కంటే సమాజ ప్రయోజనం మిన్నగా భావిం చాలి. సాహిత్యానికి అత్యున్నత ప్రాధాన్యతను ఇవ్వాలి. ప్రజల సమస్యలు తమ సమస్యలుగా భావించాలి. అప్పుడే నిజమైన సాహిత్యం వర్ధిల్లుతుంది.
బాల సాహిత్యంలో కూడా ఈ రకమైన మార్పు చోటు చేసుకున్నప్పుడే ప్రశ్నించే తత్వాన్ని, స్వభావాన్ని, నిలదీసే మనస్తత్వాన్ని సమాజంలో పాదుకొల్పిన వాళ్లం అవుతాం. స్త్రీలు, కార్మికులు, వివిధ అస్తిత్వ వాద ఉద్యమాలకు చెందిన సమస్యలన్నింటి పైన పోరాడే క్రమంలో ప్రజలు, ప్రజాస్వామిక వాదులకు రచయిత లు మద్దతుగా, భరోసాగా నిలబడాలి.
పాలకులు, పెట్టుబడిదారీ వర్గం, ఉగ్రవాద ముఠాలు ప్రజలపై ప్రజాస్వా మ్యవాదులపై మేధావులపైన చేసే అక్రమ ప్రయోగాలు, అణచివేత నిర్బంధాలకు అక్షర రూపాలు ఇవ్వాలి. ప్రజ ల మీద పాలకులు చేస్తున్న యుద్ధం అసహజం, అవివే కం, అమానవీయం. కానీ పెట్టుబడిదారీ వర్గం,
ఉగ్రవాద ముఠాలు, పాలకుల పైన ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, సృజనకారులు, సాహితీవేత్తలు చేసే అక్షర పోరాటం అత్యంత సమంజసనీయమేకాక న్యాయ ధర్మ సమ్మతం. వారి కృషి సమసమాజ స్థాపనకు దారి తీసేదిగా సాగాలి. ఈ క్రమంలో సాహిత్య రంగం గురుతర పాత్ర పోషించవలసిన అవసరం ఉంది.