17 April, 2026 | 12:10 PM

Breaking News

హరివంశ్ రాజ్యసభ ఉపసభాపతిగా ఏకగ్రీవం   •   ఏడేళ్లుగా డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంచడంలో అర్థమేంటీ?   •   హన్మకొండ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ ఖరారు   •   ఉపాధి హామీ కూలీలకు త్రాగునీటి ఇబ్బంది లేకుండా చూడండి   •   కీలక బిల్లులపై సర్వత్రా ఉత్కంఠ! లోక్‌సభలో 4 గంటలకు ఓటింగ్   •   రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా కాదు.. అది అసదుద్దీన్ ఓవైసీ ఫార్ములా   •   సోనాల మండల కేంద్రంలో నిఘా నేత్రాల ఏర్పాటు   •   డిల్లీ లో వేం నరేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జారె   •   రోడ్డు భద్రతా ప్రమాణాలపై ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో సమావేశం   •   వృద్ధుల కోసం వైద్య సేవలు అందించడం ఎంతో అవసరం   •  

ఆలయాలు నిర్మించిన ఘనత బీఆర్‌ఎస్‌దే

03-05-2025 12:00 AM

మాజీ మంత్రి జోగు రామన్న

ఆదిలాబాద్, మే 2 (విజయ క్రాంతి): ఆలయాల నిర్మాణాలకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిధులను మంజూరు చేసి ప్రభు త్వ నిధులతో ఆలయాలు నిర్మించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని మాజీ మంత్రి రామన్న పేర్కొన్నారు.

జైనథ్ మండలం కరంజిలో నూతన ఆలయంలో నంద మైసమ్మ విగ్రహ ప్రతిష్ఠాపనలో మాజీ మంత్రి జోగు రామన్న పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశా రు. అనంతరం రామన్న మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వాలు నిర్మించనన్ని వివిధ ఆలయాల నిర్మాణం కోసం బీఆర్‌ఎస్ ప్రభు త్వ నిధులు కేటాయించిందని గుర్తు చేశారు.

గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ దేవతల ప్రాధా న్యత ఎంతో విలువైందని, అంటు వ్యాధులు దరిచేరకుండా  గ్రామ దేవతలు కాపాడతా యని దృఢమైన నమ్మకంతో పూజించడం జరుగుతుందని తెలిపారు. నాయకులు మారిశెట్టి గోవర్ధన్, మహేందర్ రెడ్డి, బిక్కి రవీందర్, గంగన్న, గ్రామస్తులు పాల్గొన్నారు.