31 August, 2026 | 10:20 PM

Breaking News

శ్రీరంగాపూర్‌లో శాస్త్రవేత్తల క్షేత్ర సందర్శన   •   బిజెపి మహా దీక్షను విజయవంతం చేయాలి   •   కొమరం భీమ్ నగర్ గ్రామంలో త్రాగునీటి సమస్య కు పరిష్కారం చూపండి   •   ప్రజల సొంతింటి కల సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్యం   •   ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకే జాగో తెలంగాణ యాత్ర   •   ఆదివాసి బిడ్డ శిరీషపై అత్యాచారం చేసి హత్య చేసిన దుండగులను శిక్షించాలి   •   సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలి   •   పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి వెంటనే పూర్తి చేయాలి   •   బిజెపి నాయకులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి   •   మహబూబ్‌నగర్–డోన్ రైల్వే డబుల్ లైన్‌కు భూసేకరణ త్వరలో పూర్తి   •  

వారసుడి నిర్ణయం దలైలామా చేతుల్లోనే

04-07-2025 12:00 AM

-స్పష్టం చేసిన భారత్

న్యూఢిల్లీ, జూలై 3: 15వ దలైలామాను ఎన్నుకునే అధికారం ప్రస్తుత బౌద్ధమత గురువు దలైలామా చేతుల్లోనే ఉంటుందని భారత్ స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘దలైలామా వారసుడిని నిర్ణయించే అధికారం, అందులో జోక్యం చేసుకునే హక్కు ఎవరికీ లేదు.

ఆ నిర్ణయం పూర్తిగా ఆయన చేతుల్లోనో లేదా ఆ సంస్థ మాత్రమే చేస్తుంది. దలైలామా స్థానం టిబెటన్లకు మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన ఆనుచరులందరికీ ఎంతో ముఖ్యమైనది’ అని రిజిజు పేర్కొన్నారు. దలైలామా 90వ పుట్టినరోజు వేడుకలు బుధవారం హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల సుగ్లాగ్‌ఖాంగ్ ఆలయంలో ప్రారంభమయ్యాయి. దీనికి భారత్ తరఫున రిజిజు, జనతాదళ్ (యునైటెడ్) నాయకుడు లల్లన్ సింగ్‌లు హాజరుకానున్నారు.