09-06-2025 12:00:00 AM
ఎమ్మెల్యే బొజ్జు పటేల్
అదిలాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): బాల్య వివాహాలను అరికట్టి, బాల కార్మిక వ్యవస్థను రూపుమాపడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బోజ్జు పటేల్ అన్నారు. ఒరిస్సా రాష్ట్రంలోని కేందూఝర్ జిల్లాలో మే నెల 31వ తేదీన జరిగిన నాలుగు రాష్ట్రాల ఆస్పురై ఇండియా, గోండు సమాజ మేధావుల సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యేను జిల్లా బాలల హక్కుల పరిరక్షణ వేదిక కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం శాలువాతో సన్మానించారు.
ఒరిస్సాలో ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఇచ్చిన మోటివేషనల్ స్పీచ్, క్లాసుతో నాలుగు రాష్ట్రాలలో గోండు సమా జం మేధావులు పిల్లలను బడికి పంపించే కార్యక్రమాలు మొదలు పెట్టారన్నారు. చదువుతోనే ఆదివాసీల భవిత అని, వందల సంవత్సరాల నుండి ఆదివాసులు చదువుకు దూరంగా ఉన్నారని అందుకే విద్య, ఉద్యోగ రీత్యా మనం వెనుకబడి ఉన్నామన్నారు. బాల్య వివాహాలు ఎందుకు చేస్తున్నారనే దానిపై సర్వేలు మొదలుపెట్టారని, దీనికి ఐఎఫ్ఎస్ రిటైర్డ్ కగేశ్వర్ నాయక్రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారన్నారు.
బాలల హక్కుల పరి రక్షణ వేదిక తెలంగాణ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ మెంబర్ మీర్జా యాకూబ్ గత 20 ఏండ్ల నుంచి బాల్యం పిల్లల హక్కు బడి బయట పిల్లలందరూ బాల కార్మికులే అనే నినాదం తో నిస్వార్థ భావనతో సేవ చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో అదిలాబాద్ జిల్లా సామాజిక సక్రియ కార్యకర్త తిరుపతి, ఒరిస్సా రాజ్య ఆస్పురై ఇండియా బాలల హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్ సాంబశివ రావు, ఆస్పురై ఇండియా ఝార్ఖండ్ ప్రోగ్రాం ఇంచార్జ్ నరేష్ , జిల్లా బాలల హక్కుల జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు అశోక్ తదితరులు ఉన్నారు.