21-06-2025 05:56:26 PM
గ్రామీణ ప్రాంతాలలో హర్షం వ్యక్తం చేస్తున్న ఇందిరమ్మ లబ్ధిదారులు
ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మించి ఇవ్వడమే
ప్రతి పేద కుటుంబానికి గూడు ప్రభుత్వ లక్ష్యం.
అర్హులందరికీ దశలవారీగా ఇల్లు మంజూరు.
ఏటూరునాగారం (విజయక్రాంతి): రాష్ట్ర పంచాయితి రాజ్ గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క(Minister Danasari Anasuya Seethakka) ఆదేశాల మేరకు. ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ సూచనల మేరకు ఏటూరునాగారం మండలం కేంద్రంలోనీ దళితవాడలో శనివారం ఇందిరమ్మ లబ్ధిదారులు ఇల్లు నిర్మించుకోవడం కోసం ముగ్గు పోసే కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ఏటూరునాగారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇర్సవడ్ల వడ్లవెంకన్న మండల పార్టీ అధ్యక్షులు చిటమట రఘు, జిల్లా కార్యదర్శి గుడ్ల దేవేందర్, మైనార్టీ అధ్యక్షులు ఆయుబ్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోయడంతో స్థానిక గ్రామపంచాయతీ అధికారులు జియో ట్యాగ్ ద్వారా ఇంటి ముగ్గు పోసిన ప్రదేశం ఫోటోలను కెమెరాలలో రికార్డ్ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఇందిరమ్మ లబ్ధిదారులు కర్నే ప్రమీల మాట్లాడుతూ... గత పది సంవత్సరాలలో టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిరుపేద ప్రజల మైన తమకు ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవని టిఆర్ఎస్ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం హాయమంలో తమ పేదల సొంత ఇంటి కల నెరవేరిందని ఆనంద పడుతూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయామంలో తమకు ఇండ్లు రావడం జరిగిందని తమకు ఇండ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి. మంత్రి దానసరి అనసూయ సీతక్కకి దక్కిందని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ అధికారులు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా నాయకులు. యువజన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.