calender_icon.png 14 June, 2025 | 7:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టైగర్ జోన్ ఏర్పాటు విరమించుకోవాలి

11-06-2025 12:00:00 AM

  1. 49 జీవోను రద్దు చేయాలి

ఎమ్మెల్యే కోవ లక్ష్మి డిమాండ్

కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్10 (విజ యక్రాంతి): టైగర్ జోన్ ఏర్పాట్లు విరమించుకోవాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి పునర్ఘటిం చారు. మంగళవారం హైదరాబాద్‌లో మం త్రి సీతక్క అధ్యక్షతన  గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆమె హాజరయ్యారు. సందర్భంగా ఎమ్మెల్యే  లక్ష్మి మాట్లాడుతూ ఆదిలాబాద్ ఆసిఫాబాద్ జిల్లాలోని కవ్వాల్ పులుల అభయారణ్యం పరిధిలో ప్రాంతాలను కలుపుతూ ప్రభుత్వం విడుదల చేసిన 49 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఎమ్మెల్యేకు గిరిజన ఎమ్మెల్యేలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. జీవో రద్దు కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్షలను మం త్రి సీతక్క  హామీతో విరమించినట్లు తెలిపా రు. టైగర్ జోన్ ఏర్పాటుతో అడవిని నమ్ముకుని దశాబ్దాలుగా జీవిస్తున్న ఆదివాసీల జీవనోపాధికి తీవ్రంగా నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పోడు సాగు చేసుకుంటున్న ఆదివాసీలను ఫారెస్ట్ అధికారులు  తరుచూ ఇబ్బందులకు గురిచేస్తుండ గా ఇప్పుడు టైగర్ జోన్ పేరుతో వారి హక్కులను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 

స్పోర్ట్స్ స్కూల్‌తో పాటు రెగ్యులర్ ఆశ్రమ పాఠశాల ఏడాది నుండి ప్రారంభించారని కోరారు. కెరమెరి మండలంలో రాజీ వ్ యువ వికాసానికి అవగాహన లేకపోవడంతో ఆదివాసీలు తక్కువ స్థాయిలో దర ఖాస్తు చేసుకున్నారని మరోసారి అవకాశం కల్పించాలని ఆమె కోరారు.