11-06-2025 12:00:00 AM
- విజేతలకు బహుమతులను అందజేసిన ఎంపీ, ఎమ్మెల్యే
ఆదిలాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): ఆదిలాబాద్లోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి హాకీ సబ్ జూనియర్ టోర్నమెంట్ రాష్ట్ర విజేతగా హైదరాబాద్ జట్టు నిలిచింది. రెండు రోజుల పాటు జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉమ్మడి చెట్లు పాల్గొన్నారు. మంగళవారం జరిగిన ఫైనల్ పోటీలతో టోర్నమెంట్ ముగిసింది.
క్రీడాకారులు ఉత్తమ ప్రతిభను కనబరిచారు. టోర్న మెంట్ విజేతగా హైదరాబాద్ జట్టు నిలవగా, 2వ స్థానంలో నిజామాబాద్, 3వ స్థానంలో నల్గొండ జట్లు నిలిచాయి. టోర్నమెంట్ ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, తెలంగాణా హాకీ అసోసియేషన్ అధ్యక్షులు విజయ్ కుమార్ పాల్గొన్నారు.
కాగా కార్యక్రమంలో పాల్గొన్న హాకీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ కుమార్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బాలూరి గోవర్ధన్ రెడ్డి, గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి పార్థసారథి, నాయకులు యూనుస్ అక్బని, లోక ప్రవీణ్ రెడ్డి పాల్గొన్నారు.