16-06-2025 12:40:43 AM
తెలంగాణ చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ దిల్ రాజు టాలీవుడ్ జనా లకు కీలక సూచనలు చేశారు. ‘తెలంగాణ గద్దర్ చలనచిత్ర పురస్కారాలు’ ప్రదానోత్సవం శనివారం హైదరాబాద్ హైటెక్స్ ప్రాంగణంలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకను విజయవంతం నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పేందుకు దిల్ రాజు ఆదివారం సాయంత్రం ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో దిల్ రాజు మాట్లా డుతూ.. “తెలంగాణ గద్దర్ అవార్డుల వేడుక నిన్న ఘనంగా జరిగింది.
ఆ విషయంలో ఆనందంగా ఉంది. దానికోసం ఆరు నెలలుగా పనిచేశాం. ముందుగా 2024 సినిమాలకే అవార్డులు ఇవ్వాలనుకున్నాం. రాష్ట్రం ఆవిర్భవించిన ఏడాది నుంచీ ఇస్తే బాగుంటుందని పలువురు సూచించారు. ఆ మేరకు 2014 నుంచి 2023 వరకూ ఏడాదికి మూడు ఉత్తమ చిత్రాలను ఎంపిక చేయడం కష్టమైన పని. వేడుకలో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు. సీఎం రేవంత్రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వాస్తవానికి నిన్నటి వేడుకకు సీఎం ఒక గంట మాత్రమే కేటాయించాలనుకున్నారు. కానీ, ఆయన వేడుకకు వచ్చిన తర్వాత.. పరిస్థితిని వివరించాను.
అలా 2:15 గంటల పాటు అక్కడ ఉన్నారు. సీఎం చేతుల మీదుగా అవార్డులను అందుకున్న వారంతా చాలా ఆనం దంగా ఉన్నారు. ఈ పురస్కారాల వేడుక విషయంలో మాకు మార్గనిర్దేశం చేసిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రభుత్వం నుంచి అవార్డులు వస్తున్నాయంటే.. చాలా జాగ్రత్తగా వాటిని స్వీకరించాలి.
ఎక్కడున్నా, షూటింగ్తో బిజీగా ఉన్నా రావాలి. ప్రభుత్వంతో ప్రయాణించాల్సిన బాధ్యత సినిమా వారందరిదీ. ఇకపై ప్రభుత్వం తరఫున అవార్డుల వేడుక ప్రకటన వచ్చినప్పుడు.. మీ డైరీల్లో నోట్ చేసుకొని, మీకు వచ్చిన అవార్డు తప్పకుండా స్వీకరించండి. చిత్ర పరిశ్రమకు ఇది నా విజ్ఞప్తి. అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా” అన్నారు. వేడుకను విజయవంతం చేసినవాళ్లందరికీ ఎఫ్డీసీ ఎండీ హరీశ్ ధన్యవాదాలు తెలిపారు.