3 April, 2026 | 3:10 AM

‘పిఠాపురంలో’ పట్టుకో బాబా

03-04-2026 12:00 AM

సీనియర్ దర్శకులు మహేశ్‌చంద్ర దర్శకత్వంలో రూపొందిన ‘పిఠాపురంలో అలా మొదలైంది’ చిత్రం ఏప్రిల్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణ, సన్నీ అఖిల్, విరాట్, సాయిప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా ఇందులో ప్రధాన తారాగణం. దుండిగళ్ల బాలకృష్ణ, ఆకుల సురేశ్ పటేల్, ఎఫ్‌ఎం మురళి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో శ్రీరామ్ తపస్వి రాసిన ‘పట్టుకో బాబా’ పాటను ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఆవిష్కరించి, టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.