08-06-2025 01:03:47 AM
2030 నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యం
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
హైదరాబాద్, జూన్ 7 (విజయక్రాంతి): భవిష్యత్తు అంతా గ్రీన్ పవర్దేనని, ఆ మేరకు తెలంగాణ రాష్ర్టం ప్రాధాన్య రంగంగా గుర్తించి ప్రణాళికలతో ముందుకెళ్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. శనివారం కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పిన్నాపురంలో గ్రీన్ కో ఇంటిగ్రేటెడ్ పవర్ ప్రాజెక్టును సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
తెలంగాణలో గ్రీన్ పవర్ ఉత్పత్తి కి సంబంధించి లక్ష కోట్ల విలువైన ఎంవోయూ లు కుదిరాయని వెల్లడించారు. తెలంగాణ రాష్ర్టం 2025 న్యూఎనర్జీ పాలసీని తీసుకొచ్చిందని, 2029 నాటికి రాష్ర్టంలో 20 వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యంగా ముందుకెళ్తున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న విద్యుత్తు వినియోగాన్ని దృష్టిలో పెట్టుకొని వివిధ మార్గాల్లో విద్యుత్ ఉత్పత్తికి అవకాశాలను అన్వేషిస్తూ మిగులు విద్యుత్ దిశ గా రాష్ర్టం ముందుకెళ్తుందన్నారు.
ప్రపంచం లో ప్రతీ ఉత్పత్తికి విద్యుత్తు అవసరమని, ఉత్పత్తి పెరగాలంటే విద్యుత్తు సరఫరా పుష్కలంగా ఉండాలని, ఉత్పత్తులు పెరిగితే ఉపాధి తో పాటు రాష్ర్ట జీడీపీ పెరుగుతుందని, ఇదం తా ఒక చక్రంలా తిరుగుతుందని వివరించారు. కేవలం బొగ్గు ఆధారంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తే ఖర్చు పెరగడంతో పాటు, కాలుష్యం పెరిగి వాతావరణ సమతౌల్యం దెబ్బతింటుందని వాపోయారు.
ఈ నేపథ్యంలో ప్రపంచం మొ త్తం గ్రీన్ పవర్ వైపు పరుగులు పెడుతోంందని వెల్లడించారు. అన్ని దేశాలు సోలార్తో పాటు విండ్, థర్మల్, ఫ్లోటింగ్ సోలార్, హైడ్రోజన్ పవర్ వంటి మార్గాల ద్వారా విద్యుదుత్పత్తిని ప్రోత్సహిస్తూ ముందుకెళ్తున్నాయని తెలిపారు.
పగలు సోలార్ ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్ను స్టోరేజీ చేసుకొని, రాత్రివేళ పంపు డు స్టోరేజ్ ద్వారా పీక్ అవర్స్లో విద్యుత్తు ఉత్పత్తి చేసి విదేశాలకు సరఫరా చేస్తున్న గ్రీన్ కో ఇంటిగ్రేటెడ్ పవర్ ప్రాజెక్టును కంపెనీ యాజమాన్యం ఆహ్వానం మేరకు గ్రీన్ పవర్ ఉత్పత్తి పరిశీలించినట్టు తెలిపారు. 4 వేల ఎకరాల విస్తీర్ణం లో ఒకే చోట సోలార్, విండ్, పంపుడ్ స్టోరేజీ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయ డం ప్రపంచంలోనే మొదటిసారి అని తెలిపా రు.
గ్రీన్ కో కం పెనీ సోలార్ ద్వారా నాలుగు వేల మెగావాట్లు, విండ్ పవర్ ద్వారా వేయి మెగావాట్లు, పంపుడు స్టోరేజీ ద్వారా 1,680 మెగావాట్లు మొత్తంగా ఒకే చోట 6,680 మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి అభినందించదగిన విషయమన్నారు. దేశంలో భవిష్యత్తులో గ్రీన్ కో వంటి ప్రాజెక్టులు పెద్దఎత్తున రావాల్సిన అవసరం ఉందన్నారు.
పర్యటనలో ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ట్రాన్స్కో సీఎండీ కృష్ణ భాస్కర్, జెన్ కో సీఎండీ హరీశ్, దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి పాల్గొన్నారు.