17-06-2025 01:19:15 AM
తాడ్వాయి, జూన్, 16( విజయ క్రాంతి ): అన్ని రంగాలలో అభివృద్దే లక్ష్యంగా నరేంద్ర మోడీ పాలన దూసుకు పోతుందని బిజెపి నాయకులు తెలిపారు కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో సోమవారం నరేంద్ర మోడీ పాలన 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు మోడీ ప్రభుత్వం-సంకల్ప సభ కార్యక్రమంలో భాగంగా ఎర్ర పహాడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో మొక్కలు నాటారు.
అనంతరం తాడ్వాయిలో వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు నరేంద్ర మోడీ దేశ ప్రజల కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో తాడ్వాయి మండల బిజెపి శాఖ అధ్యక్షులు సంతోష్ రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు పాటిమీది గంగారెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ లింగారావు, జిల్లా కార్యవర్గ సభ్యులు హోటల్ శ్రీను, ప్రధాన కార్యదర్శి నరసింహులు, మండల ఉపాధ్యక్షులు బాలాజీ, రాజిరెడ్డి, తిరుపతిరెడ్డి, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.