calender_icon.png 20 June, 2025 | 1:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

19-06-2025 08:30:52 PM

నడిగూడెం: నడిగూడెం మండల(Nadigudem Mandal) కేంద్రంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన వజ్రాల కమలమ్మ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు జయ సీతా రామ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు వల్లెపు శ్రీనివాస్ గురువారం పరామర్శించారు. ఆమె కుటుంబ సభ్యులకు 25 కేజీల బియ్యం ఒక నూనె డబ్బాను అందజేశారు. ఈ కార్యక్రమంలో జూలూరి వెంకటాచారి, పల్లపు తిరుమలేశు, పల్లపు నాగరాజు, గుంజ మురళి తదితరులు పాల్గొన్నారు.