29-04-2025 12:00:00 AM
జిల్లా ఎస్పీ రావుల గిరిధర్
వనపర్తి టౌన్ ఏప్రిల్ 28: ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఫిర్యాదిదారుల నుండి 09 ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎ స్పీ రావుల గిరిధర్.సోమవారం రోజు వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ రావుల గిరిధ ప్రజావాణి కార్యక్రమా న్ని నిర్వహించడం జరిగింది. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులకు పలుసూచనలు చేయడమైనది.
సోమ వారం నాడు ప్రజావాణి కార్యక్రమంలో భా గంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 09 మంది ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్ ల యొక్క ఎస్త్స్రలకు మరియు సిఐలకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని మరియు పరిష్కారానికి సూచనలు చేయడం జరిగింది.
పోలీ సులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాం తి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుం దని జిల్లా ఎస్పీ తెలియజేశారు.ప్రజా సమస్యలు పై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కారిస్తున్నామని తెలియజేశారు.