calender_icon.png 13 September, 2025 | 1:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి ఇంటికి మంజీరానీరు అందించడమే లక్ష్యం

13-09-2025 03:02:52 AM

- రూ.200 కోట్లతో ప్రతిపాదనలు సిద్దం చేయండి

- మిషన్ భగీరథతో మంజీరా వాటర్ స్కీంను దెబ్బతిశారు

- అధికారుల సమీక్షలో జగ్గారెడ్డి ఫైర్

సంగారెడ్డి, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి) :సంగారెడ్డి ప్రజలకు శుభ్రత, నాణ్యతతో కూ డిన సరిపడా మంజీరా నీళ్ళు అదనంగా సరఫరా చేసేందుకు రూ.200 కోట్లతో ప్రతి పాదనలు తయారు చేయాలని మున్సిపల్, పబ్లిక్ హెల్త్ అధికారులకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సూచించారు. శుక్రవా రం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు.

అదనంగా కొత్త ఫిల్టర్ బెడ్, కొత్త ఇం టెక్ వెల్ నిర్మాణం చేయాలని సూచించారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ పండుగలప్పుడు ఉదయం, సాయంత్రం అదనంగా రెండు గంటల పాటు మంజీరా నీళ్ళు ఇవ్వాలని, సంగారెడ్డి మున్సిపాలిటీలో ఇప్పుడున్న ఫిల్టర్ బెడ్ కు అదనంగా మరో ఫిల్టర్ బెడ్ , ఇంటెక్ వెల్ నిర్మించాలని ప్రతిపాదనలు త యారు చేయాలన్నారు. అవసరమైన చోట కొత్త డిస్ట్రిబ్యూషన్ లైన్స్, ట్యాంక్ ల నిర్మా ణం చేపట్టాలన్నారు.

సంగారెడ్డి పట్టణ శి వారు గ్రామాలైన కల్పగురు, కులబ్గూర్, తా ళ్లపల్లి, గంజిగూడెం, ఇరుగుపల్లి, కోత్లాపూర్, ఫసల్ వాది తదితర గ్రామాల వరకు తాగునీటి సరఫరా ఉండేలా డిజైన్ చేయాల న్నారు. రానున్న 50 ఏళ్ల వరకు సంగారెడ్డి మున్సిపాలిటీకి ఎలాంటి తాగునీటి ఇబ్బందులు రాకుండా ఉండేలా ప్రణాళికలు త యారు చేయాలని సూచించారు. ఇరిగేషన్, ఆర్ డబ్ల్యూఎస్ అధికారులతో కలిసి మరోసారి సమీక్ష సమావేశం నిర్వహిస్తానని తెలి పారు.

ఉమ్మడి రాష్ట్రంలో సంగారెడ్డి మున్సిపాలిటీకి ప్రత్యేకంగా మంజీరా వాటర్ స్కీమ్ తెచ్చానని, రాష్ట్ర విభజన తర్వాత మంజీరా వాటర్ స్కీమ్ ను నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మంజీరా వాటర్ స్కీమ్ స్థానంలో మిషన్ భగీరథను తెచ్చి వాటర్ సరఫరాకు ఇబ్బందులు తెచ్చారని విమర్శించారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మంజీరా స్కీమ్ ఇచ్చిన మాదిరిగా నీటి సరఫరా ఉం డాలంటే ఏం చేయాలో అధికారులు చెప్పాలని ప్రశ్నించారు.

దీంతో ఇప్పుడున్నరెండు మోటార్లు స్థానంలో మరో రెండు  కొత్త మోటార్లు కావాలని అధికారులు కోరారు. పండుగల రోజు ఉదయం, సాయంత్రం రెం డు గంటలు మంజీరా నీరు రావాలని అధికారులను జగ్గారెడ్డి ఆదేశించారు. మిషన్ భగీరథపై ఆధారపడకుండా సరఫరా చేయాలన్నారు.

మిషన్ భగీరథతో సంబంధం లే కుండా డైరెక్ట్ గా పాత మంజీరా వాటర్ స్కీమ్ మాదిరిగా నేరుగా సంగారెడ్డి మున్సిపాలిటీకి మంజీరా నీళ్ళు సరఫరా చేయా లని, ఇది నా టార్గెట్ అని అధికారులకు స్పష్టం చేశారు. రాజంపేట ఫిల్టర్ బెడ్, ఇంటెక్వెల్ పునరుద్దరణకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులకు ఆదేశించారు. కాగా ఫిల్టర్ మీడియాను రీప్లేస్ చేసే అవసరం ఉందని అధికారులుతెలిపారు.