calender_icon.png 18 June, 2025 | 12:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం..

17-06-2025 06:55:08 PM

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ...

కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యమని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ(BRS leader Shambipur Krishna) పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ శంభీపూర్ లోని కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణని నియోజకవర్గానికి చెందిన పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, సంక్షేమ సంఘాల సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయా కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా శంభీపూర్ క్రిష్ణ మాట్లాడుతూ... మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి వివేకానంద్ ల దృష్టికి తీసుకెళ్లి వారి సహాయ సహకారాలతో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.