18-07-2025 12:35:04 AM
హైదరాబాద్, జూలై 17 (విజయక్రాంతి): మహిళలకు ఆర్థిక స్వాతంత్రం కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, మహిళలు ఆర్థికంగా బలోపేతం అయినప్పుడే లింగ వివక్ష సమస్య నివారించే అవకాశం ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం నిజాం కళాశాలలో మహిళా కమిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లింగ సమానత్వం సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు.
మహిళా సాధికారతే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, మొదటి ఏడాదిలోనే 21,632 కోట్లు వడ్డీ లేని రుణాలను స్వయం సహాయక సంఘాలకు పంపిణీ చేశామని వివరించారు. ఐదేళ్లలో లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు మహిళల చేతిలో తిరిగితే ఆర్థిక స్వాతంత్రం, లింగ సమానత్వం సాధ్యమవుతుందన్నారు. విద్యార్థినిలు బాగా చదువుకొని ఉద్యోగాలు సాధించాలని, ఉద్యోగాలు సాధించలేని వారు ప్రభుత్వం అందించే వడ్డీ లేని రుణాలతో వ్యాపారాలకు నాంది పలకాలని సూచించారు.
నిర్మాణ, విద్యుత్ రంగాల్లో కొద్దిమంది ప్రైవేటు వ్యక్తులే నిలబడి విజయం సాధిస్తారని ప్రచారంలో ఉందని, కానీ తాము అందుకు భిన్నంగా గ్రీన్ పవర్ ఉత్పత్తిలో భాగంగా మహిళా సంఘాలతో 2,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈ తరహా కార్యక్రమం దేశంలోని ఏ రాష్ర్టంలో ఇప్పటివరకు జరగలేదన్నారు.
రాష్ర్టంలోని మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు మహి ళా సంఘాల ద్వారా 650 బస్సులు కొనుగోలు చేయించి ఆ బస్సులను ఆర్టీసీకి అద్దెకు ఇప్పించి ఆదాయం వచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. రాజ్యాంగం ద్వారా మహిళలు, కులం, మతం అనే తేడా లేకుండా అందరికీ హక్కులు దక్కాయని వివరించారు.
పూర్వ విద్యార్థిగా గర్వపడుతున్నాను
1880లో ప్రారంభించిన నిజాం కళాశాల చాలా గొప్పదని, ఈ రాష్ర్టం, దేశానికి మాత్ర మే కాకుండా ప్రపంచానికి గొప్ప సైంటిస్టులను, రాజకీయ నాయకులను, పరిపాలకుల ను అందించిందని కొనియాడారు. కిరణ్ కు మార్రెడ్డి, నాదెండ్ల మనోహర్, తాను కూడా నిజాం కళాశాల విద్యార్థులు కావడం మరువలేని జ్ఞాపకమన్నారు. తాను రూమ్ నెంబర్ 36లో ఉండి చదువుకున్న జ్ఞాపకాలను నెమ రు వేసుకున్నారు.
1982--84 మధ్యకాలంలో నిజాం కళాశాలలో చదివిన తన సహచరులు గొప్పగా చదువుకొని అమెరికాలో సైంటిస్టులుగా స్థిరపడ్డారని, వారంతా నిత్యం కలు స్తుంటారని తెలిపారు. నిజాం కళాశాల సమస్యలను సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని, పూర్వ విద్యార్థిగా ఒక రోజు నిజాం కళాశాలలో గడపాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు.