calender_icon.png 18 June, 2025 | 5:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి

17-06-2025 11:43:32 PM

భవన నిర్మాణ సంక్షేమ బోర్డును ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పజెప్పే ప్రతిపాదన విరమించుకోవాలి..

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు..

ఏఐటీయూసీ తెలంగాణ బిల్డింగ్ అండ్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ భారీ ధర్నా..

ముషీరాబాద్ (విజయక్రాంతి): భవన నిర్మాణ సంక్షేమ బోర్డులో ప్రమాదవశాత్తు, సహజ మరణం చెందిన క్లెయిమ్ లను ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పజెప్పాలి అనుకున్న ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(MLA Kunamneni Sambasiva Rao) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం ఏఐటీయూసీ తెలంగాణ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని లేబర్ కమిషనర్ కార్యాలయం ముందు జరిగిన భారీ ధర్నాలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న సంక్షేమ బోర్డును ఇన్సూరెన్స్ రంగాలకు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేయడం బాధాకరమని అన్నారు. రాష్ట్రంలో 15 లక్షాకుపైగా మంది భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డులో నమోదయి ఉన్నారు. భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ద్వారా చెల్లిస్తున్నటువంటి డబ్బులు లేబర్ డిపార్ట్మెంట్ చేతులు దులుపుకొని బీమా కంపెనీకి అప్పజెప్పడంలో మతలబెంటో  చెప్పాలని అన్నారు. అధికారులు ఎలాంటి కారణాలు చెప్పకుండా గోప్యంగా ఉంచడంలో అంతరం అంతర్యం ఏమిటి అని ఆయన  ప్రశ్నించారు. ఏఐటియూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎండి యూసఫ్ ప్రధాన కార్యదర్శి ఎస్ బాలరాజ్ ప్రసంగించారు.

ఈ ధర్నా కార్యక్రమంలో తెలంగాణ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మోటె నరసింహ, వర్కింగ్ ప్రెసిడెంట్ గన్నారపు రమేష్, అధ్యక్షులు ఏం ప్రవీణ్  కుమార్, ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండి ఇమ్రాన్, మేకల శ్రీనివాస్, పానుగంటి పర్వతాలు, బి ఓ సి రాష్ట్ర ఉపాధ్యక్షులు జి రాజు నూనె వెంకటేశ్వర్లు,  గాదె లక్ష్మీనారాయణ, జీ పరమేష్, సహయ కార్యదర్శిలు  కమతం యాదగిరి, ఎస్ మల్లేష్, కే వెంకటేష్ , మల్లికార్జున్ ,శివశంకర్ కోశాధికారి కే నర్సింహారెడ్డి, శ్రీనివాస్, గణేష్, కాషయ్య,బి కిషన్, రాజు, గోవర్ధన్, అశోక్, ఎన్ రామస్వామి లక్ష్మణ్, లావణ్య,రాజమ్మ,రజిత, తదితరులు పాల్గొన్నారు.