18-06-2025 12:00:00 AM
చౌటుప్పల్, జూన్ 17(విజయక్రాంతి): చౌటుప్పల్ మండలం ఆరెగూడెం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లావిద్యాశాఖ అధికారి కే.సత్యనారాయణ సందర్శించి అనంత రం పాఠశాల విద్యార్థులతో ముచ్చటిస్తూకఠోర,శ్రమ,పట్టుదల,అంకితభావంతో కృషి చేసినట్లయితే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని ఉద్బోధించారు.
మహానుభావులు అయిన వివేకా నంద, అబ్దుల్ కలాం, మహాత్మా గాంధీ మొదలగు వారి జీవితచరిత్రలు అధ్యయనం చేయడం వల్ల సన్మార్గంలో నడవడానికి అవకాశం ఉంటుందని చెప్పారు.వ్యసనాలకు దూరంగా ఉండాల ని, క్రమశిక్షణ, విలువలతో కూడిన జీవితాన్ని గడపాలని సూచించారు.ఈ కార్యక్రమం లో పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు నల్లెంకి శంకరయ్య ,బోధనా సిబ్బంది అయిన శ్రీమతి శ్వేత, విజయ్ ప్రతాప్, నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.