21-06-2025 01:25:29 AM
ముషీరాబాద్, జూన్ 20 (విజయ క్రాంతి) : కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో వాగ్దా నం ప్రకారం రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలనీ, జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిఎస్సీ నోటిఫికేషన్ జారి చేసి అన్ని కేటగిరిల 25 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలనీ జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ.ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.
శుక్రవారం ఇందిరా పార్క్ వద్ద నిరుద్యోగ జేఏసీ చైర్మన్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట అద్యక్షులు నీల వెంకటేష్ అధ్యక్షతన భారి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ గత 18 నెలల కాలంలో పలు కోర్ట్ నోటిఫికేషన్లు కలిపి 60వేల ఉద్యోగాలు కుడా భర్తీ చేయలేదని వృజమేత్తరు. మిగతా ఉద్యోగాలు భర్తీ చేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ శాఖలలలో పెద్దెత్తున ఉన్న ఖాళీలను భారతి చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రభుత్వం జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా జాబ్ క్యాలెండర్ ను ప్రకటిస్తామంటే నిరుద్యోగులంత ఎదురు చూశారు కాని ప్రశ్నించలేదని, ఇప్పటి కైనా వెంటనే ప్రకటించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డి ముఖమంత్రి కావడానికి నిరుద్యోగులు కారణమని వీరిని విస్మరించడం తగదని హెచ్చరించారు. ప్రభుత్వాని కొందరు అధికారాలు ఖాళీలు లెక్కించే విషయంలో తప్పుతోవ పట్టిస్తున్నారని అన్నారు.
ఖాళీ పోస్టులు లేకిం చేటప్పుడు ప్రబుత్వ అధికారులు తప్పు డు విధానా అధికారులు తప్పుడు విధానా అవలంబిస్తున్నరన్నారని విమర్శించారు. ఎంత మంది రిటైర్ అయ్యారు? ఎంతమందికి ప్రమోషన్లు ఇచ్చారు? కొత్త జిల్లాలు ఆఫీసులు రావడం వలన ఎన్ని ఉద్యోగాలు సృష్టించారనే అంశాలను దృష్టి లో పెట్టుకోకుండా ఖాళీలు భర్తీ చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి నిరుద్యోగ సమస్య పరిష్కరించడానికి ప్రత్యక శ్రద్ద తీసుకోవాలని కోరారు.
ప్రైవేటు రంగం ఐటీ తదిదర ఉద్యోగాలతో పాటు ముఖ్యమైన ప్రభుత్వ శాఖలైన విద్య, వైద్యం, రెవిన్యూ, పంచాయత్ రాజ్య శాక ఉద్యోగాలను పూర్తి స్థాయిలో భర్తీ చేయాలనీ కోరారు. ఈ ధర్నాలో నాయకులు వేముల రామకృష్ణ, పగిల్ల సతీష్, జిల్లాపల్లి అంజి, శివ, రాజేందర్, రాజు నేత తదితరులు పాల్గొన్నారు.