25-06-2025 04:55:19 PM
వలిగొండ (విజయక్రాంతి): భవన నిర్మాణ కార్మిక సంఘం వెల్వెర్తి గ్రామ శాఖ అధ్యక్షుడు కల్కూరి అంజయ్య అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. భవన నిర్మాణ కార్మిక సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో సంతాపం తెలియజేస్తూ పుష్పగుచ్చాల నుంచి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం మండల గౌరవ అధ్యక్షుడు తుర్కపల్లి సురేందర్, భవన నిర్మాణ కార్మిక సంఘం మండల కార్యదర్శి రాధారపు మల్లేశం మాట్లాడుతూ... భవన నిర్మాణ కార్మికుడు కల్కూరి అంజయ్య గత 35 సంవత్సరాల నుండి భవన నిర్మాణ కార్మికుడిగా పని చేసుకుంటూ, అనేక ప్రమాదాల గురి కావడం జరిగిందని గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మరణించడం బాధాకరమని అన్నారు.
అంజయ్య భవన నిర్మాణ కార్మిక సంఘం గ్రామ శాఖ అధ్యక్షుడు గత కొంతకాలంగా పనిచేస్తూ కార్మికులకు అనేక సేవలు అందించారని వారు లేకపోవడం కార్మికులకు నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అంజయ్య కుటుంబానికి 5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు సింగారం వెంకటేశం, మండల్ నాయకులు ఉక్కుర్తి స్వామి, మొగిలిపాక ఎల్ల స్వామి, చేగురి నగేష్ కలిమిరా సుదర్శన్ ఉకుర్తి నాగయ్య, కల్కూరి బాలరాజు, పోలెపాక శంకర్, కలుకూరి శంకరయ్య, బొజ్జ కిష్టయ్య, చెమడాల నర్సింగ్, ఉక్కుర్తి శీను, గుర్రాల రాములు, తదితరులు పాల్గొన్నారు.