calender_icon.png 6 June, 2025 | 11:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళా సాధికారత లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది..

05-06-2025 06:33:14 PM

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి..

హనుమకొండ (విజయక్రాంతి): మహిళా సాధికారత కోసం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(MLA Naini Rajender Reddy) అన్నారు. గురువారం రోజున 61వ డివిజన్ పరిధిలోని సిద్ధార్థనగర్ లో రూ.22.60 లక్షలతో నిర్మించిన రాణి రుద్రమ దేవి మహిళా భవన్ ని ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ... అందరూ ఐకమత్యంతో అనతికాలంలోనే మహిళా భవనాన్ని నిర్మించి ఆదర్శంగా నిలిచారన్నారు. ప్రతి కాలనీలో కూడా అభివృద్ధిపై ప్రతినిధులకు కాలనీ వాసులు సహకరిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని అన్నారు.

ప్రతి కాలనీలలో కాలనీ అభివృద్ధి కమిటీలు అవసరమని పేర్కొన్నారు. గతంలో 50 లక్షలు పై చిలుకు నిధులు రాని 61వ డివిజన్ కి దాదాపు 3 కోట్ల పై నిధులు కేటాయించి సీసీ రోడ్లు, సీసీ డ్రైన్ నిర్మాణాలు చేపట్టామని గుర్తు చేశారు. అర్ధాంతంగా నిలిచిపోయిన కాజీపేట బ్రిడ్జి పునర్నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లి 14 కోట్ల నిధులను మంజూరు చేసి పనులను ప్రారంభించామని అన్నారు. డివిజన్లలో సిబ్బంది కొరత ఉందని స్థానికులు కోరగా ఇటీవలే కౌన్సిల్ లో తీర్మానం చేసి పంపామని రానున్న వర్షాకాలం నాటికి సరిపడా సిబ్బందిని నియమిస్తామని హామీ ఇచ్చారు. తమ కాలనీలో అభివృద్ధి కోసం కృషి చేసిన సందర్భంగా కాలనీ పెద్దలు, అభివృద్ధి కమిటీ సభ్యులు ఎమ్మెల్యేని శాలువతో సత్కరించి, కృతజ్ఞతలు తెలియజేశారు.