అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి..
వనపర్తి టౌన్: వనపర్తి పట్టణంలో పెండింగ్ లో ఉన్న వివిధ అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి(District Collector Adarsh Surabhi) ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టర్ తన చాంబర్ లో పట్టణంలోని పెండింగ్ అభివృద్ధి పనులపై మున్సిపల్, పబ్లిక్ హెల్త్ ఇంజనీర్లతో కమిషన్ నిర్వహించారు. పట్టణంలో ఇప్పటికే నిధులు మంజూరై పనులు పెండింగ్ లో ఉన్న వాటిని త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని పబ్లిక్ హెల్త్ ఇంజనీర్లను ఆదేశించారు.
కళాభవన్, మినీ ట్యాంక్ బండ్, అమ్మ చెరువు, నల్లచెరువు అభివృద్ధి పనులను త్వరగా చేపట్టాలని సూచించారు. అదేవిధంగా పట్టణంలో చేపట్టాల్సిన డ్రైనేజీలు, చిట్యాల రోడ్డు, అప్పాయిపల్లి రోడ్డు తదితర పనుల పురోగతిపై కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. వాటిని త్వరగా పూర్తిచేసి విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఇన్చార్జ్ యాదయ్య, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, పబ్లిక్ హెల్త్ డి ఈ శ్రీనివాస్, ఎ. ఈ తదితరులు సమీక్షలో పాల్గొన్నారు.






