16-05-2025 12:00:00 AM
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎంపీ మల్లురవి
కడ్తాల్, మే 15 : పల్లెల అభివృద్ధే ప్రభు త్వ లక్ష్యమని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎంపీ మల్లురవి అన్నారు. గురువారం కడ్తాల్ మండలం మైసిగండి గ్రామంలో పదుశ్రీ ప్యారడైస్ కాలనీ, ఎల్లమ్మ తండా మిషన్ భగీరథ నీటి దహర్తి తీర్చడానికి ఎ మ్మెల్యే నిధుల నుండి రూ. 5 లక్షలతో పైప్ లైన్ పనులు ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడారు. నియోజకవ ర్గంలో ఎక్కడ తాగునీరు సమస్య లేకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, పొల్యూషన్ బోర్డు మెంబర్ బాలాజీ సింగ్, పిసిసి సభ్యుడు శ్రీనివాస్ గౌడ్, కాం గ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బీచ్యా నాయ క్, జగన్, జహార్ లాల్, హీరాసింగ్, చం దోజి, కిషన్, చేకూరి వెంకటేష్, తులసిరామ్, అమర్ సింగ్, దేనా, చిన్న, సాయి, శివరాం, ప్రేమ లక్ష్మి , శారద, కవిత, కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.