22-09-2025 12:35:18 AM
వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి, తెలంగాణ రాష్ట్ర స్పోరట్స్ అథారిటీ చైర్మన్ కే శివసేనారెడ్డి
వనపర్తి, సెప్టెంబర్ 21 ( విజయక్రాంతి ) : రాష్ట్రంలోని క్రీడాకారులను ప్రోత్సహించి అంతర్జాతీయ స్థాయిలో వారు అత్యుత్తమం గా రాణించేలా చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోదని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి, తెలంగాణ రా ష్ట్ర స్పోరట్స్ అథారిటీ చైర్మన్ కే శివసేనారెడ్డి లు అన్నారు. ఆదివారం వనపర్తి జిల్లా కేం ద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న .
11వ అంతర్ జి ల్లా సీనియర్ మెన్స్ అండ్ ఉమెన్స్ సెపక్ తా క్రా చాంపియన్షిప్ క్రీడా పోటీలకు శివసేన రెడ్డి స్థానిక శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రీడలకు వనపర్తి మార్కెట్ యార్డు చైర్మ న్ శ్రీనివాస గౌడ్ అధ్యక్షత వహించారు. క్రీడలను ప్రారంభించడానికి ముందు ముఖ్య అతిథులు ప్రముఖ క్రీడాకారుడు, హాకీ దిగ్గ జం మేజర్ ధ్యాన్ చాంద్ చిత్రపటానికి పూ లమాల వేసి నివాళి అర్పించి, క్రీడా జ్యోతిని వెలిగించారు.
అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మహ బూబ్నగర్, ఆదిలాబాద్ జట్ల మధ్య ఆటల పోటీలను ప్రారంభించారు. ఈ టోర్నమెం ట్లో తెలంగాణలోని 10 ఉమ్మడి జిల్లాల వారీ గా ఒక్కో జిల్లా నుంచి మెన్స్ ఉమెన్స్ రెండు జట్లు చొప్పున మొత్తం 20 జట్లు పాల్గొననున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సంద ర్భంగా వనపర్తి శాసనసభ్యులు తూడి మే ఘారెడ్డి, తెలంగాణ రాష్ట్ర స్పోరట్స్ అథారిటీ చైర్మన్ కే శివసేనారెడ్డి లు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్య త ఇస్తుందని చెప్పారు.
ప్రభుత్వం ఏర్పడిన ఈ రెండేళ్లలో రూ.800 కోట్లు క్రీడలకు కేటాయించిందన్నారు. రాష్ట్రంలో క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లేందుకు పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. సెపక్ తాక్రా క్రీడకు సంబంధించి బా ల్స్ కొనుగోలు చేసేందుకు కొంత ఇబ్బందులు ఉన్నట్లు తెలిసిందని ఇందుకు సంబం ధించి అట్టి క్రీడకు సంబంధించిన అసోసియేషన్ వారు తమకు నివేదిక ఇస్తే మలేషియా నుంచి బంతుల్ని తెప్పించేందుకు తప్పనిసరిగా కృషి చేస్తామన్నారు. క్రీడాకారులకు కావాల్సిన అన్ని సదుపాయాలని కల్పిస్తామ ని,
క్రీడాకారులు అత్యుత్తమంగా రాణించి మెడల్స్ తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు.వనపర్తి జిల్లాకు స్పోరట్స్ స్కూ ల్ మంజూరు చేసిందని, అదేవిధంగా పెద్దమందడి, ఘనపూర్ మండలాలకు మినీ స్టేడియంలో శాంక్షన్ చేసిన సీఎంకు, క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్కు ధన్యవాదాలు తెలిపారు. జిల్లా కేంద్రానికి సమీపంలో 9 ఎకరాల్లో క్రికెట్ కోసం స్థలాన్ని కేటాయించినట్లు కూడా ఎమ్మెల్యే తెలియజేశారు.
సెపక్ తాక్రా క్రీడల్లో రాణించి ఇన్కమ్ టాక్స్ విభాగంలో ఉద్యోగాన్ని సంపాదించిన ఘనపురం అమ్మాయి నవతను ఎమ్మెల్యే అభినందించారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని అంద రూ క్రీడల్లో రాణించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెపక్తక్రా క్రీడల జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, జిల్లా క్రీడల అధికారి సుధీర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సెపక్ థాక్రా ఉ మ్మడి మహబూబ్నగర్ జిల్లా సెక్రెటరీ పబ్బ భాస్కర్ గౌడ్, ఇతర ప్రజాప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.