16-06-2025 01:11:57 AM
ప్రారంభించనున్న సీఎం రేవంత్రెడ్డి
హైదరాబాద్, జూన్ 15 (విజయక్రాంతి): ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసా య విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రైతునేస్తం కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించనున్నారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. యూనివర్సిటీ ఆడిటోరి యంలో మంత్రి తుమ్మల సంబంధిత అధికారులతో రైతునేస్తం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలో 1,034 రైతువేదికల్లో రైతునేస్తం ప్రారంభం జరుగుతోందని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,600 రైతువేదికల్లో ‘రైతునేస్తం’ కార్యక్రమం ప్రసారం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగే కార్యక్రమానికి 1,500 మంది రైతులు పాల్గొంటారని తెలిపారు.
ఇప్పటికే 566 రైతువేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం కల్పించామని, ప్రతీ మంగళవారం రైతునేస్తం కార్యక్రమం ద్వారా శాస్త్రవేత్తలతో ప్రత్యక్షంగా ముఖాముఖి, ఆదర్శ రైతుల అనుభవాలు, వ్యవ సాయ రంగంలో వస్తున్న నూతన ఆవిష్కరణలను రైతులకు తెలియజేయడం జరుగు తుందని మంత్రి పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభు త్వం వ్యవసాయరంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని, అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే రూ.78 వేల కోట్లు రైతు సంక్షేమానికి ఖర్చు చేసినట్లు తెలిపారు. సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతిని ధులు, రైతులు పాల్గొనాలన్నారు.