28 June, 2026 | 1:53 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

దొడ్డి కొమరయ్య ఆశయాలను సాధించాలి

04-04-2026 12:23 AM

సంస్థాన్ నారాయణపూర్, ఏప్రిల్ 3: సంస్థాన్ నారాయణపూర్ మండలం కేంద్రంలో  దొడ్డి కొమురయ్య జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గణం నర్సింహ  ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య కురుమ 99వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ.. దొడ్డి కొమురయ్య కురుమ తెలంగాణ రైతాంగ సాయిదా పోరాటంలో తొలి అమరుడుగా చరిత్రలో నిలిచారని తెలిపారు.

రైతుల హక్కులు సామాజిక న్యాయం సమానత్వం కోసం  చేసిన పోరాటం తరతరాలకు ఆదర్శమని పేర్కొన్నారు.ఆయన ఆశయాల సాధనకు ప్రతిఒక్కరు కృషి చేయాలని అన్నారు.     ఈ కార్యక్రమంలో నారాయణపురం గ్రామ సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి , నారాయణపూర్ ఉపసర్పంచ్ పల్లె మల్లారెడ్డి, మాజీ సర్పంచ్  కోన్రెడ్డి నర్సింహ, మాజీ ఎంపీటీసీ బచ్చనగోని గాలయ్య యాదవ్, కుమ్మరి హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సిలివేరు అంజయ్య, సిపిఐ పార్టీ మండల కార్యదర్శి దుబ్బాక భాస్కర్ పాల్గొన్నారు.