20-06-2025 08:38:02 PM
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) రాజంపేట మండల కేంద్రంలోని తాడ్వాయి మండలం కాళోజివాడి గ్రామానికి చెందిన ఐకెపి వివోఏ శ్వేత గత నెలలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఎడమ కాలు 5 చోట్ల విరిగినందున శుక్రవారం తాడ్వాయి మండల వివో ఏలు పదివేల రూపాయల ఆర్థిక సహాయం చేసి పరామర్శించారు.
ఐకెపి వివో ఏ ఉద్యోగుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పఠాన్ గౌస్ ఖాన్, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మాలోత్ శివరాం నాయక్, తాడ్వాయి మండల అధ్యక్షురాలు రాజేశ్వరి రెడ్డి, మాచారెడ్డి మండల అధ్యక్షుడు అంకం కిషోర్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు మోహన్ రావు, జిల్లా ప్రచార కార్యదర్శి పుట్ట రాజశేఖర్ ముదిరాజ్, రవీందర్ రెడ్డి, లతా రెడ్డి ,షబానా బేగం రాధిక శుక్రవారం శ్వేతాను రాజంపేటలో పరామర్శించారు.