20-06-2025 08:36:00 PM
భిక్కనుర్ మండల పార్టీ అధ్యక్షుడు ఉప్పరి రమేష్..
కామారెడ్డి (విజయక్రాంతి): బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని భిక్కనుర్ బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు ఉప్పరి రమేష్(BJP Mandal Party President Uppari Ramesh) అన్నారు. భారతీయ జనతా పార్టీ భిక్కనుర్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశం పద్మశాలి కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు ఉప్పరీ రమేష్ మండల నూతన బీజేపీ కార్యవర్గాన్ని ప్రకటించారు.
మండల పార్టీ ఉపాధ్యక్షులుగా నరేందర్ రెడ్డి, ముదాం శ్రీనివాస్, సాయిరెడ్డి, అరిగే నర్సింలు, రామచంద్రం, ఏనుగు శ్యాం రెడ్డి, ప్రధాన కార్యదర్శిలుగా అత్తిలి తిరుమలేశ్, పొన్నాల రంజిత్, కార్యదర్శులుగా స్వామి, బల్ల బాల్ లింగం, బోయిని హరిద్ర, రవీందర్ రెడ్డి, యువ మోర్చా అధ్యక్షులుగా భాస్కర్ రెడ్డి, మహిళా మోర్చా అధ్యక్షులుగా శ్వేత, కిసాన్ మోర్చా అధ్యక్షులుగా జైపాల్ రెడ్డి లకు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు తెలిపారు. పార్టీ నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేస్తూ, పార్టీని మండలంలోని ప్రతి గ్రామంలో విస్తరించాలని మండల పార్టీ అధ్యక్షుడు ఉప్పరి రమేష్ తెలిపారు.