21-06-2025 06:05:13 PM
నిందితుడు రంగస్వామి అరెస్ట్ రిమాండ్ తరలింపు..
విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన డీఎస్పీ మొగులయ్య..
గద్వాల టౌన్: అక్రమ సంబందం కాస్త హత్యకు దారి తీసిందని డీఎస్పీ మొగులయ్య(DSP Mogilaiah) తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హత్యకు సంబందించిన వివరాలను వెల్లడించారు. కేటీ దొడ్డి మండలం పాతపాలెం గ్రామంలో ఈనెల 16న జరిగిన బోయ అనిత అనే వివాహిత అనుమానస్పద మృతి చెందింది. అనుమానస్పద కేసు నమోదు చేసిన పోలీసులు పాతపాలెం గ్రామానికి చెందిన రంగస్వామి అనే వ్యక్తితో బోయ అనితకు గత కొద్దిరోజులుగా అక్రమ సంబంధం నడిచేదని తమ ప్రాథమిక విచారణలో తెలియడంతో రంగస్వామిని విచారించడం జరిగింది.
రంగస్వామిని అదుపులోకి తమ దయిన శైలిలో విచారించగ ఈ మధ్య కాలంలో అనిత నడవడికలో మార్పు గమనించిన రంగస్వామి ఆమెను అనుమానించి గొంతు నులిమి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రికరించాడని డీఎస్పీ మొగులయ్య తెలిపారు. నిందితుడు రంగస్వామిని కోర్ట్ ముందు ప్రవేశపెట్టి రిమాండ్ కు తరలించినట్లు డీఎస్పీ మొగులయ్య తెలిపారు. ఈ సమావేశంలో సీఐ టంగుటూరి శ్రీను,కేటి దొడ్డి ఎస్ఐ శ్రీనివాసులు సిబ్బంది పాల్గొన్నారు.