23-02-2026 01:04:21 AM
భూపాలపల్లి జిల్లా టీఆర్పీ అధ్యక్షుడు రవి పటేల్
హైదరాబాద్, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న స్వామి జాతరలో రజకులపై దాడి బాధాకరమని జయశంకర్ భూపాలపల్లి జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు రవి పటేల్ అన్నారు. దాడిలో రెండు నెలల పసికందు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమన్నారు. దేవుడి దర్శనానికి వెళ్లిన వారిని కులం పేరుతో అవ మానించడం, దాడి చేయడం తగదన్నారు.
ఈ ఘటనలో నిందితులపై పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. లేదంటే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఆయనవెంట జిల్లా ఉపాధ్యక్షుడు ఎన్నికల ప్రణయ్ రాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్ కౌటం సురేందర్, జిల్లా కార్యదర్శి మోటాపోతుల సమ్మయ్య, జిల్లా నాయకులు ఏదునూరి స్వామి రజక తదితరులు పాల్గొన్నారు.