calender_icon.png 4 June, 2025 | 3:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విసుగు చెంది.. స్పందించి.. సమస్య పరిష్కరించి..

02-06-2025 11:34:42 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారి గుంతల మయంగా మారగా ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు ప్రతిరోజు మీడియాలో కథనాలు వస్తున్నప్పటికీ అధికారులు స్పందించకపోవడంపై విసుగు చెందిన ఓ సాధారణ వ్యక్తి ఆటో డ్రైవర్ స్పందించడంపై జిల్లా కేంద్రవాసులు హర్షం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే ఆటో డ్రైవర్ ఆనందరావు జిల్లా కేంద్రంలో ప్రతిరోజు ఆటో నడుపుతాడు.

ప్రధాన రహదారిపై గుంతలు పూడ్చడంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహించడంతో విసుగుచేంది తన ఆటోలో సంచులతో రాళ్లు మట్టి తీసుకువచ్చి గుంతలు పూడ్చుతున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అధికారులు ప్రజాప్రతినిధులు కనీసం పట్టించుకోకపోవడంతో జిల్లా కేంద్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, మొత్తం గుంతలను తాను పూడ్చలేకపోవచ్చని అయితే తనతో అయినంత వరకు గుంతలు పూడ్చనున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు కనులు తెరిచి ప్రధాన రహదారి మరమ్మతుల కోసం చర్యలు తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాలి.