calender_icon.png 3 June, 2025 | 12:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇల్లందు ఏరియా ఉత్తమ ఉద్యోగులను ప్రకటించిన యాజమాన్యం

02-06-2025 12:25:26 AM

ఇల్లెందు, జూన్ 1 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను పురస్కరిం చుకొని సింగరేణి సంస్థ ఇల్లందు ఏరియా నందు ఉత్తమ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను సింగరేణి యాజమాన్యం ప్రకటిం చింది. ఈ సందర్భంగా ఉత్తమ అధికారి , ఉత్తమ ఉద్యోగులు పురస్కారాలకు ఎంపిక కా బడిన ఉద్యోగులను ఏరియా జనరల్ మేనేజర్ విసం కృష్ణయ్య అభినందనలు తెలిపా రు.

ఏరియా ఉత్తమ అధికారి కె..ఓ.సి అడిషనల్ మేనేజర్ ఉండం బ్రహ్మం ఈయనకు కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియం నందు సెంట్రల్ ఫంక్షన్ లో సన్మానము చే స్తారని తెలిపారు. ఉత్తమ ఉద్యోగిగా జె.కె. 5.ఓ.సి.లో పని చేసే హెడ్ ఓవర్ మ్యాన్ షేక్ అలియాజ్గర్, ఉద్యోగ పురస్కారానికి ఎంపిక కాబడిన ఉద్యోగీకి స్థానిక బ్లాక్ డైమండ్ స్టేడియం నందు నిర్వహించబడే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో జి.ఎం విసం కృష్ణ య్య చే తుల మీదుగా సన్మానించి, ప్రశంస పత్రాలు అందచేస్తారు.

ఇల్లందు ఏరియాలో 87 శాతం బొగ్గు ఉత్పత్తి : జీఎం

ఇల్లెందు, జూన్ 1 (విజయక్రాంతి): సింగరేణి ఇల్లందు ఏరియా జిఎం కార్యాల యంలో ఆదివారం ఏర్పాటుచేసిన పత్రిక స మీక్షా సమావేశంలో మే నెల బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత వివరాలను ఏరియా జి.యం కృష్ణయ్య తెలిపారు. మే-2025 నెలకు నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి 3.10 లక్షల టన్నులకు గాను 2.71 లక్షల టన్నుల బొగ్గు తీసి మొత్తం 87 శాతం ఉత్పత్తి చేయడం జరిగిందన్నారు. అలాగే 1.57 లక్షల టన్నుల బొగ్గును రైల్వే మార్గం ద్వారా, 0.42 లక్షల టన్నులు రోడ్డు మార్గం ద్వారా మరియు ఆర్.సి.హెచ్.పి ద్వా రా 0.54, ఇల్లందు ఏరియా లో మొత్తం 2. 54 లక్షల టన్నుల బొగ్గు బట్వాడా చేయడం జరిగింది.  

కొత్తగూడెం ఏరియా ఉత్తమ ఉద్యోగులు వీరే

కొత్తగూడెం, జూన్ 1 (విజయక్రాంతి ): 11వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కొత్తగూడెం ఏరియాకు గాను పాను గంటి రాంబాబు, జనరల్ అసిస్టెంట్, జేవీఆ ర్‌ఇ సి, శ్రీ జక్కుల గట్టయ్య, సాంప్లింగ్ మ జ్దూర్, ఆర్సిహెచ్పి లను ఉత్తమ ఉద్యోగులు గా ఎంపిక చేశారు.

వీరిలో శ్రీ పానుగంటి రాంబాబు, జనరల్ అసిస్టెంట్, జేవీఆర్‌ఇ సి ను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కొత్తగూడెం లోని ప్రకాశం స్టేడియం నందు జరుగు సెంట్రల్ ఫంక్షన్లో , శ్రీ ఎన్. బలరాం  చేతుల మీదుగా,శ్రీ జక్కు ల గట్టయ్య, సాంప్లింగ్ మజ్దూర్, ఆర్సిహెచ్పి కీ తేది 02.06.2025 న ప్రగతి వనం, రుధ్రంపూర్ నందు సాయంత్రం 07.00 గంటలకు జరుగు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ ఎం. షాలేం రాజు చేతుల మీదు గా సన్మానం జరగనుంది.