04-06-2025 12:00:00 AM
500 లారీలతో వెంచర్కు మట్టి
ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్
భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 3, (విజయ క్రాంతి) చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడం అంటే ఇదేనేమో. అధికారులను బురిడీ కొట్టించి లేఔట్ పర్మిషన్ పొందిన స్థ లాన్ని మామిడి తోటగా చూపించి అక్రమ వెంచర్ కు బెషరతుగా మట్టి తోలుతున్న వై నం ఇది. చెరువులోని పూడికను తొలగించి రైతులకు పొలాలకు వినియోగించుకోవాలని అధికారులు ఇచ్చిన అవకాశాన్ని రియ ల్ ఎస్టేట్ వ్యాపారులు సద్వినియోగం చేసుకుంటున్నారు.
పాత పాల్వంచలోని చింతల చెరువు నుంచి మట్టిని తోలకాలు చేస్తూ రియల్ ఎస్టేట్ అభివృద్ధికి వినియోగిస్తున్నారు.ఉన్న పొలాలను కన్వర్షన్ చేసుకొని, డిటిపిసి అప్రూ వల్ పొంది ఉన్న స్థలాలకు, పొలం మాటున రియల్ ఎస్టేట్ వ్యాపారుల దందా జోరుగా సాగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని శేఖరంబంజర్ లోని 12 ఎకరాల డిటిపిసి అప్రోవల్ వెంచర్ కు సక్రమం మాటున అక్రమంగా మట్టి తోలకాలు జోరుగా సాగుతున్నాయి.
421 సర్వే నెంబర్లు గల 12 ఎకరాల మామిడి తోటను గతం లో డిటిపిసి అప్రూవల్ కు దరఖాస్తు చేశారు. మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఆ స్థలాన్ని కన్వర్షన్ చేసి డ్రాఫ్ట్ ఇవ్వటం జరిగింది. దీం తో ఆ స్థల యజమాని రోడ్లో డ్రైనేజీల నిర్మాణాన్ని చేపట్టాడు. ఫైనల్ లేఔట్ అప్రోల్ కాకపోవ డంతో ఇంకా ప్లాటింగ్ జరగలేదు. అదే అదునుగా మామిడి తోటను చూపించి రెవెన్యూ, నీటిపారుదల అధికారులను బురి డీ కొట్టించి మామిడి తోటకు మట్టి కావాలంటూ,కలెక్టర్ ఆదేశాలను సద్వినియోగం చేసుకున్నారు.
పాపం పుణ్యం తెలియని అధికారులు మామిడి తోట కోసం 500 లారీల మట్టిని, మూడు రోజులపాటు తోలుకునేందుకు అనుమతులు ఇచ్చారు. సదరు ఆ స్థల యజమాని ఆ మట్టిని మామిడి తోటకు కా కుండా డిటిపిసి అప్రోలోతో ఏర్పాటు చేసిన డ్రైనేజీ, రోడ్లు నిర్మించిన ప్రాంతాల్లో మట్టి తోలకాలు భే శరత్ గా సాగుతున్నాయి. అక్ర మ మట్టి తోలకాలకు రెవెన్యూ, నేటి పారద ల శాఖ అధికారుల అండదండలు మెండుగా ఉన్నాయని సర్వ త్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ విషయంలో పెద్ద మొత్తంలో డ బ్బులు చేతులు మారినట్టు వినిపిస్తోంది. గత ఏడాది అదే చింతలచెరువు అభివృద్ధి ప నుల మాటున మట్టితోలకాలను రియల్ ఎ స్టేట్ భూములకు తోలిన విషయం విధితమే. గతంలో జరిగిన పరిణామాలను అధికారులు పరిగణలోకి తీసుకోకుండా మళ్లీ అదే తరహాలో మట్టితోలకాలకు అనుమతు లు ఇవ్వడం డబ్బులు చేతులు మారాయనే ఆరోపణలు ధ్రువపరుస్తున్నాయి.
జిల్లా కలెక్టర్ భూగర్భ జలాల అభివృద్ధికి చెరువుల్లో మట్టితోల కాలు చేయాలని సదుద్దేశంతో ఇ చ్చిన అవకాశాన్ని కొందరు అక్రమాలకు పా ల్పడుతు న్నారు. జిల్లా కలెక్టర్ కల్పించుకొని అధికారులను తప్పుదోవ పట్టించిన ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారిపై తగు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజల డిమాండ్ చేస్తున్నారు.
మామిడి తోట కంటే అనుమతిచ్చాం
మామిడి తోటకు మట్టి కావాలంటూ దరఖాస్తు చేస్తే మూడు రోజులపాటు 500 లారీల మట్టి తోలుకునేందుకు అ నుమతి ఇచ్చామని నీటిపారుదలశాఖ డిఈ రాణి తెలిపారు. మట్టిని మామిడి తోటకు కాకుండా రియల్ ఎస్టేట్ వ్యా పారానికి వాడుతున్నారని ఆ మద దృ ష్టికి తీసుకెళ్లగా పరిస్థితిని పరిశీలిస్తామన్నారు.
రాణి, నీటిపారుదల శాఖ డీఈ
కన్వర్షన్ ఆయన స్థలం అగ్రికల్చర్ పరిధిలోకి రాదు
కన్వర్షన్ చేసుకొని డిటిపిసి అప్రూవల్ పొందిన స్థలం తిరిగి వ్యవసాయ భూమిగా చూపటం కుదరదని జిల్లా టౌన్ ప్లానింగ్ అధికారి సత్యనారాయణ తెలిపారు.
టౌన్ ప్లానింగ్ అధికారి