04-06-2025 12:00:00 AM
గద్వాల, జూన్ 03 ( విజయక్రాంతి ) : అయిల్ పామ్ సాగు రైతులకు దీర్ఘకాలికం గా స్థిర ఆదాయాన్ని అందించే పంటగా ని లుస్తుందని జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగ రావు అన్నారు. మంగళవారం ధరూర్ మం డలం ర్యాలంపాడు గ్రామంలో హార్టికల్చర్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆయిల్ పా మ్ మొక్కల నాటే కార్యక్రమంలో పాల్గొని స్వయంగా మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన ఆ యిల్ పామ్ సాగు ప్రాధాన్యత,దీని ద్వారా రైతులకు లభించే ఆదాయ మార్గాల గురించి గ్రామస్థులకు అవగాహన కల్పించారు. అ నంతరం ఉపాధి హామీ పథకం కింద నాటిన మామిడి తోటను అదనపు కలెక్టర్ పరిశీలించారు. మొక్కల పెరుగుదల,నిర్వహణ, నీటి సరఫరా తదితర అంశాలపై సమీక్ష నిర్వహిం చి, తగిన సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాఖ అధికారి అక్బర్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.