04-06-2025 12:00:00 AM
జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్
గద్వాల, జూన్ 3 ( విజయక్రాంతి ) : గ్రామస్థాయిలో భూ సమస్యల పరిష్కారాని కి భూ భారతి కీలకంగా మారుతోందని జి ల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ అన్నారు. మంగళవారం గద్వాల్ మండలం అనంతపు రం గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సు లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జూన్ 03 నుండి జూన్ 20 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు.
భూ సమస్యలు ఉంటే సంబంధిత ఫారం నింపి అధికారులకు అం దజేయాలని రైతులకు సూచించారు. గ్రామా ల్లో జరిగే భూ భారతి సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు పిలుపుని చ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ,ఆర్డీఓ అలివేలు, గద్వాల తహసీల్దార్ మల్లికార్జున్,రెవిన్యూ సిబ్బంది, రైతులు,తదితరులు పాల్గొన్నారు.