calender_icon.png 26 June, 2025 | 2:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టాయిలెట్లను శుభ్రం చేసిన అధికారి

25-06-2025 12:31:09 AM

శభ్రత ప్రాముఖ్యతను చాటిన హుస్నాబాద్ మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్  

హుస్నాబాద్, జూన్ 24: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ పట్టణంలోని పబ్లిక్ టాయిలెట్లను స్వయంగా శుభ్రం చేసి పరిశుభ్రత ప్రాముఖ్యతను తెలియజేశారు. కేవలం ఆదేశాలు ఇవ్వడమే కాకుండా, పరిశుభ్రత కోసం చీపురు పట్టుకొని ఆచరణలో నిలిచారు. వందరోజుల కార్యాచరణలో భాగంగా సోమవారం ఆయన పట్టణంలోని ఎల్లమ్మ దేవాలయం సమీపంలో ’షి టాయిలెట్స్’ వద్ద జరిగిన శ్రమదాన కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్నారు.

మున్సిపల్ అధికారులు, వార్డు ఆఫీసర్లు, శానిటేషన్ సిబ్బందితో కలిసి టాయిలెట్ల ముందు భాగాన్ని శుభ్రం చేశారు. పేరుకుపోయిన చెత్తను తొలగించారు. ఆయనే స్వయంగా పనుల్లో పాల్గొనడం సిబ్బందిలోనూ, స్థానికుల్లోనూ ఉత్సాహాన్ని నింపింది. ఈ సందర్భంగా కమిషనర్ మల్లికార్జున్ మాట్లాడుతూ, ప్రజలందరూ పబ్లిక్ టాయిలెట్లను బాధ్యతగా వాడుకోవాలని సూచించారు.